ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పడింది. మ్యాచ్ ప్రారంభం అయిన కొద్దిసేపటికే చినుకులు పడటంతో అంపైర్లు మ్యాచ్ను ఆపేశారు. అంతరాయ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 19/0గా ఉంది. క్రీజ్లో ఉస్మాన్ ఖవాజా (13*), మెక్స్వీనీ (2*) ఉన్నారు.
ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పడింది. మ్యాచ్ ప్రారంభం అయిన కొద్దిసేపటికే చినుకులు పడటంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. మ్యాచ్ అంతరాయ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 19/0గా ఉంది. క్రీజ్లో ఉస్మాన్ ఖవాజా (13*), మెక్స్వీనీ (2*) ఉన్నారు.
బ్రిస్బేన్లో జరుగుతున్న భారత్- ఆస్ట్రేలియా మూడో టెస్ట్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు టెస్టుల్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలవడంతో ఈ మూడో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఎలాగైనా ఈ మ్యాచ్ను గెలవాలని చూస్తున్న భారత్.. అశ్విన్ స్థానంలో జడేజా, హర్షిత్ రాణా బదులు ఆకాశ్ దీప్ను బరిలోకి దింపుతుంది.
నేడు నెల్లూరులో జరగాల్సిన జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ వర్షం కారణంగా వాయిదా వేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షం కారణంగా పాడైనా ట్రాక్ & ఫీల్డ్ ఈవెంట్స్ కోర్ట్లు తిరిగి సిద్ధం చేస్తున్నామన్నారు. శనివారం జరగవలసిన ఈవెంట్స్ ఆదివారానికి వాయిదా వేసినట్లు వారు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా పోలీస్ సిబ్బంది, మీడియా గమనించాలన్నారు.
సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో మధ్యప్రదేశ్ ఘన విజయం సాధించింది. బెంగళూరు వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. కేవలం 15.4 ఓవర్లలోనే మధ్యప్రదేశ్ బ్యాటర్లు లక్ష్యాన్ని ఛేదించారు. అంతకుముందు నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ.. 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
వరుసగా 11 వన్డేల్లో ఓటముల తర్వాత వెస్టిండీస్ ఓ సిరీస్ గెలిచింది. సెయింట్ కిట్స్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఆఖరి వన్డేలో WI 4 వికెట్ల తేడాతో విజయం సాధించి 3 వన్డేల సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ విధించిన 321 పరుగుల లక్ష్యాన్ని కేవలం 45.5 ఓవర్లలోనే విండీస్ ఛేదించింది. అరంగేట్ర ప్లేయర్లు అమీర్ జాంగూ (104 నాటౌట్), కార్టీ (95) రాణించారు. కాగా సెయింట్ కిట్స్ వేదికల...
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ మూడో టెస్టుకు సిద్ధమవుతోంది. గబ్బా టెస్టు నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ మాట్లాడాడు. తాము తాజాగా సిరీస్ను ప్రారంభిస్తామని తెలిపాడు. ఇక నుంచి మూడు టెస్టుల సిరీస్గా భావించి ఆడతామని పేర్కొన్నాడు. గబ్బాలో తాము మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన చరిత్ర ఉందని వెల్లడించాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడాతో జరిగిన మ్యాచ్లో ముంబై గెలిచింది. దీంతో ముంబై ఫైనల్కు దూసుకెళ్లింది. బరోడా 20 ఓవర్లులో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 17.2 ఓవర్లలో 4 వికెల్లు కోల్పోయి 164 రన్స్ చేసి విజయం సాధించింది.
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్పై రష్యా ఫెడరేషన్ సంచలన ఆరోపణలు చేసింది. ఫైనల్లో భారత ప్లేయర్ గుకేశ్పై చైనా ఆటగాడు లిరెన్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోయారని వ్యాఖ్యానించింది. ఉత్కంఠగా సాగుతున్న పోరులో లిరెన్ చేసిన తప్పిదం పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపింది. లిరెన్ ఉన్న స్థితిలో ఓడిపోయే అవకాశమే లేదని.. దీనిపై అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ ప్రత్యేకంగా విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
WGL: కప్ పోటీల్లో భాగంగా గూడూరు మండలంలో మస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. పురుషుల కబడ్డీలో దామరవంచ టీంకి ప్రథమ స్థానం రాగా, గూడూరు టీం ద్వితీయ స్థానంలో నిలిచింది. అలాగే మహిళల విభాగంలో గూడూరు ప్రథమ స్థానంలో నిలవగా, అయోధ్యపురం టీం ద్వితీయ స్థానంలో నిలిచింది. యువతలో ఉన్న టాలెంట్ని వెలికితీసేందుకు ఇటువంటి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.
NZB: ఈనెల 14న కౌలాస్ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో కామారెడ్డి జిల్లా బాయ్స్ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీల ఎంపికలు జరుగుతాయని పీడీ సతీష్ రెడ్డి తెలిపారు. 01.01.2010 తర్వాత జన్మించిన వారి ఉండాలి. జనన ధ్రువీకరణ పత్రంతో పోటీలో ఎంపికకు క్రీడాకారుల హాజరుకావాలని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లా క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిపారు. కేవలం తనకు బీసీసీఐ అందించే రూ. 30 వేల పెన్షన్ డబ్బులపైనే ఆధారపడుతున్నానని పేర్కొన్నారు. ‘కపిల్ దేవ్ ఆఫర్ను అంగీకరిస్తున్నా.. రిహాబిలిటేషన్ సెంటర్కు వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని వెల్లడించారు. కాగా ఇటీవల కపిల్ దేవ్ తాను కాంబ్లీకి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. కానీ అతడు రిహాబిలేషన్ సెంటర్&zw...
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా గుకేష్ నిలిచాడు. ఈ నేపథ్యంలో ట్రోఫీతో పాటు రూ.11.45 కోట్ల నగదు బహుమతిని గుకేష్ అందుకున్నాడు. రన్నరప్ లిరెన్ రూ.9.75 కోట్లు సొంతం చేసుకున్నాడు. మొత్తం ప్రైజ్ మనీ రూ.21.17 కోట్లు కాగా, ఒక గేమ్ గెలిచిన ప్లేయర్కి రూ.1.69 కోట్లు అందిస్తారు. గుకేష్ గెలిచిన 3 గేమ్స్కు రూ.5.07 కోట్లు, లిరెన్ 2 గేమ్స్కు రూ.3.38కోట్లు ఇచ్చారు. మిగిలిన మ...
18 ఏళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచి గుకేష్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గుకేష్కు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ‘గుకేష్ యావత్ భారతదేశం గర్వపడేలా చేసారు. కేవలం 18 ఏళ్ల వయస్సులో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించడం ఒక అద్భుతమైన విజయం. మీ విజయం దృఢ సంకల్పంతో ఏదైనా సాధ్యమని మాకు గుర్తు చేస్తుంది. అభినంద...
MNCL: కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన కొత్తూరి ప్రణయ్ ట్రిపుల్ జంప్లో కాంస్య పతకం సాధించాడు. డిసెంబర్ 7,8,9,19,11 తేదీల్లో భువనేశ్వర్లో జరిగిన 39వ జూనియర్ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2024 పోటీల్లో ట్రిపుల్ జంప్(15.6Mtrs)లో అత్యంత ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి కాంస్య పతకం సాధించాడు.