ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత అమ్మాయిలు ఇవాళ్టి నుంచి ఆతిథ్య జట్టుతో ఏకైక టెస్ట్లో తలపడనున్నారు. మ్యాచ్ పెర్త్ వేదికగా ఉ.10:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 6 సిరీస్ల్లో భారత్ ఒక్కటే గెలిచింది. మరో 2 డ్రా కాగా.. 3 కంగారూల సొంతమయ్యాయి. ఈ పర్యటనలో ఇప్పటికే T20, వన్డే సిరీస్లను కోల్పోయిన భారత్ ఇందులోనైనా రాణించాలని చూస్తోంది.