PPM: కొమరాడ మండలంలోని జంజావతి, తోటపల్లి, వనకాబడి, గుమ్మిడిగడ్డ ప్రాజెక్టులకు బడ్జెట్లో పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ మండల కేంద్రంలో రైతు సంఘం నాయకులు కరపత్రాలను విడుదల చేసారు. ఈనెల 9న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున రైతులు పాల్గొని విజయవంతం చేయాలని రైతులు పిలుపునిచ్చారు.