TG: రాష్ట్ర నిధులతో కేరళలో ప్రభుత్వం ఎన్నికల ప్రచారం చేయడంపై మాజీమంత్రి హరీష్ రావు మండిపడ్డారు. TGలో ఖజానా ఖాళీ అని దుష్ప్రచారం చేస్తూ, కేరళలో మాత్రం కోట్లతో డబ్బా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇక్కడ పథకాలు అమలు చేసే తెలివి లేదని, ప్రకటనల పేరిట ప్రజల ధనాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహించారు. రాష్ట్ర ఖజానాను పక్క రాష్ట్రాల రాజకీయాల కోసం వాడుతారా అని ప్రశ్నించారు.