BDK: ఆళ్లపల్లి మండలంలోని తిర్లాపురం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. కరకగూడెం మండలం రేగళ్లకు చెందిన ఎం.భద్రయ్య, బీమయ్య ఆళ్లపల్లిలోని ముత్తాపురం వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్రవాహనం నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనుక కూర్చున్న భద్రయ్య అక్కడికక్కడే మృతి చెందగా. బీమయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.