NLG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను హాలియా మున్సిపల్ ఛైర్మన్ చింతల చంద్రారెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాగర్ ఎడమ కాలువ ప్రాంతంలో వైస్ ఛైర్మన్ రాజా రమేష్ యాదవ్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి పారిశుధ్య పనులు నిర్వహించారు.