బాటసారులు దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదపడతాయని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు DCCB ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. ఇవాళ సామర్లకోట పట్టణ పరిధి లారీ స్టాండ్ వద్ద మైత్రి యువజన సేవా సంఘం వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వేసవికాలంలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు.