వరంగల్ పట్టణంలోని ఓ ప్రైవేటు కార్పొరేట్ స్మాల్ ఫైనాన్స్ సంస్థ శాఖలో ఉద్యోగి, ఉన్నతాధికారులతో కలిసి రుణాల పేరిట భారీ మోసం చేశారు. తక్కువ విలువ ఆస్తులపై అధిక శాతం రుణాలు మంజూరు చేసి కమీషన్లు తీసుకున్నట్లు సమాచారం. సంస్థకు చెందిన వరంగల్ శాఖలో 271 రుణ ఖాతాల్లో మొత్తం రూ.94.16 కోట్లలో దాదాపు రూ.70 కోట్లు సంస్థకు నష్టం వాటిల్లినట్లు తెలిసింది.