PLD: జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా నరసరావుపేట టౌన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ కృతిక శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రక్తదానం మహాదానం అని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత పెద్దఎత్తున పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని ఆమె తెలిపారు. రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు.