AP: శాసనమండలి ఛైర్మన్పై అవిశ్వాసం ఎందుకు అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అసలు సంఖ్యా బలం లేకుండా అవిశ్వాసం ఎలా పెడతారని నిలదీశారు. లడ్డూ అంశంలో తాము చెప్పాలనుకుంది సభలో చెప్పామని తెలిపారు. హెరిటేజ్, ఇందాపూర్ మధ్య సంబంధం ఉందని అన్నారు. ఇందాపూర్ ద్వారా నెయ్యి సప్లయ్ చేస్తున్నారని చెప్పారు.