MDK: రామాయంపేట మున్సిపల్ కమిషనర్ బి. శ్రావణ్ శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని డంపింగ్ యార్డ్, మల్లెచెరువు సమీపంలోని జలవనరులు (వాటర్ బాడీస్), సిద్దిపేట రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం పరిసరాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పలుచోట్ల కుప్పలుగా పేరుకుపోయిన చెత్తను చూసి కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు.