MLG: గాంధీనగర్ గ్రామ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సర్పంచ్ నిర్మల-వెంకన్న తెలిపారు. ఇకపై ప్రతి సోమవారం పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రజావాణి నిర్వహిస్తామని, గ్రామస్థుల సమస్యలను స్వయంగా విని త్వరితంగా పరిష్కరిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామస్తులు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.