MNCL: జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ వల్ల ఏర్పడుతున్న కాలుష్యంపై పక్కనే ఉన్న పెగడపల్లి వాసులు సోమవారం నిజామాబాద్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. గాలి, ధ్వని కాలుష్యం వల్ల పిల్లలకు, వృద్ధులకు శ్వాస కోశ, చర్మ వ్యాధులు, ప్రజలకు తీవ్ర వింత అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని, దుమ్ము, ధూళి, పొగ వల్ల పంట నష్టాలు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.