VSP: మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ ఉదయం కుంకుమార్చన, పుష్పార్చన, అభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. దాతల సహకారంతో సుమారు 350 మంది భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.