అమెరికాలో గుజరాత్కు చెందిన మేఘనా పటేల్ అనే భారతీయ మహిళ ఓ స్టోర్లో దారుణ హత్యకు గురయ్యారు. కస్టమర్ తరహాలో మాస్క్, టోపీ ధరించి వచ్చిన ఓ దుండగుడు ఆమెతో కొద్దిసేపు మాట్లాడి, విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో ఆమె ఆస్పత్రిలో కన్నుమూశారు. దోపిడీ ఉద్దేశంతోనే ఈ హత్య జరిగినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు.