CTR: టెన్త్ పరీక్షల కోసం జిల్లాలో 129 కేంద్రాలలో అన్నీ ఏర్పాటు చేశామని DEO రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మొత్తం 23,095 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. బాలురు 12,105 మంది, బాలికలు 10,990 మంది ఉన్నారు. హాల్ టికెట్ చూపించి RTC బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. కాగా, మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి.