కర్నూలు: కోరువ సంఘం పెద్దల ఆహ్వానం మేరకు మండల కేంద్రమైన కౌతాళంలోని శివప్ప నగర్లో ఎరుకల కుల దైవం కోరువ అంజమ్మ నూతన విగ్రహ ప్రతిష్ఠ శుక్రవారం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉరుకుంద ఈరన్న మాజీ ట్రస్ట్ ఛైర్మన్ చెన్న బసప్పను కోరువ సంఘం పెద్దలు శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మంజునాథ, ఉమేశ్ గౌడ్, సిద్దు, చంద్రశేఖర్, పాల్గొన్నారు.