T20 WC 2026 టైటిల్ కోసం ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ తుది పోరుకు అహ్మదాబాద్ వేదిక కావడం క్రికెట్ అభిమానులను కలవర పెడుతోంది. వన్డే వరల్డ్ కప్ 2023లో అజేయంగా రాణించిన రోహిత్ సేన ఇక్కడే ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్ ఓడింది. ICC టోర్నీల్లో వరుసగా 13 మ్యాచుల్లో గెలిచిన భారత్ విజయ పరంపరకు కూడా ఇక్కడే సౌతాఫ్రికా బ్రేక్ వేసింది.