W.G: విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడాలంటూ పెనుగొండ విద్యాశాఖ అధికారి పి.రామకృష్ణకు ఎస్ఎఫ్ఐ నాయకులు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. మండలంలో కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్య హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్నాయన్నారు. అలాంటి విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.