W.G: రేపు సోమవారం జిల్లా కలెక్టరేట్ తో పాటు డివిజన్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఆదివారం ఆమె భీమవరంలో వివరాలు తెలిపారు.అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.