GDWL: మల్దకల్ మండల పరిధిలోని మద్దెలబండ, చిన్న తండా పరిసరాల్లో గత రెండు రోజులుగా పులి సంచరిస్తుందని స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఊరగట్టు పిల్లగుంట్ల ప్రాంతంలో ఒక గేదె, ఆవు దూడపై పులి దాడి చేసినట్లు బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున దూడపై దాడి చేసిందని తెలిపారు.