GNTR: మహిళా సాధికారత సమాజాన్ని మరింత బలపరుస్తుందని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మహిళలకు నాయకత్వ అవకాశాలు కల్పించినప్పుడే సానుకూల మార్పులు వస్తాయని, ప్రతి మహిళకు హక్కులు, న్యాయం అందాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.