SKLM: ఎస్సీ వర్గీకరణ పేరిట దళితుల ఐక్యతను దెబ్బతీయటానికి అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేశాయని ఇచ్చాపురం నియోజకవర్గ దళిత సంఘ నాయకులు దడ్డ చంద్రశేఖర్, బాగా మోహనరావులు తెలిపారు. ఇచ్చాపురంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడారు. అన్ని పార్టీలు మాల సామాజిక వర్గాన్ని దోపిడీదారులుగా చిత్రీకరించి దళిత ఐక్యతను దెబ్బతీస్తున్నారని వాపోయారు.