E.G: గోకవరం మండలం మల్లవరంలో ఉద్యాన శాఖ జీడి మామిడి రైతులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జీడి మామిడి పిక్క మొక్క కంటే అంటు మొక్క మేలని శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్ వివరించారు. నీరు సదుపాయం ఉన్న రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు కలుపు గొప్పు చేసే యంత్రాలను ఉచితంగా 100 శాతం సబ్సిడీపై అందించడం జరుగుతుందన్నారు.