ATP: జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం బాల్య వివాహాల నిర్మూలనపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. దిశా సమావేశం ముగిసిన అనంతరం రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘బాల్య వివాహ విముక్తి రథం’పై MP లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆనంద్ సంతకాలు చేశారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టి, ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు.