E.G: అసాంఘిక శక్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు శనివారం తాళ్లపూడి ఎస్సై టి. రామకృష్ణ నేతృత్వంలో గ్రామ శివార్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. గోదావరి పరిసరాలు, పొదలు, తోటల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. బహిరంగ మద్యపానం, జూదం, కోడి పందాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.