GNTR: వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు గ్రామ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో రూ.17,120 నగదు, 10 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.