SDPT: వర్గల్ మండలం నాచారం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు నాచారం, అనంతగిరిపల్లి, వేలూరు, సీతారాం పల్లి, నర్సంపల్లి, మాదారం పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు వివరించారు. ప్రజలు సహకరించాలని కోరారు.