AP: వైసీపీ వాళ్లు 11 మంది ఉన్నా.. 11 వందల మంది ఉన్నట్లు మాట్లాడతారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘వైసీపీని ఎదుర్కోవాలంటే మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్లే కల్తీలు చేసి.. మళ్లీ మనపై నిందలు వేస్తారు. వైసీపీ వాళ్లే బూతులు తిడతారు.. మళ్లీ మనపైనే నిందలు వేస్తారు’ అని పవన్ విమర్శించారు.