AKP: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు పురస్కరించుకుని నర్సీపట్నం డిఎస్పీ కార్యాలయంలో ఇవాళ మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో పాల్గొన్న సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది రక్తం దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.