ATP: గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో శుక్రవారం పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సామూహిక దీక్షలు చేపట్టారు. పారిశుద్ధ్య కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, రామంజి మాట్లాడుతూ.. సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రెండు రోజులపాటు ఈ సామూహిక దీక్షలు జరుగుతాయన్నారు.