PDPL: సుల్తానాబాద్లో జరిగిన జిల్లాస్థాయి సీఎం కప్ పోటీల్లో ఓదెల మండలంలోని కొలనూర్కు చెందిన విద్యార్థినులు సత్తాచాటారు. జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న రెండ్ల శ్రావ్యశ్రీ షాట్ఫుట్ విభాగంలో జిల్లాస్థాయిలో ఫస్ట్ ప్లేస్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. కొలిపాక అశ్విత డిస్కస్ త్రోలో సెకండ్ ప్లేస్లో నిలిచి స్టేట్ లెవల్ పోటీలకు ఎంపికైంది.
NZB: జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ మైదానంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ నేటితో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీపీ బసవరెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు, ప్రైజ్ మనీ అందజేశారు. క్రికెట్ విన్నర్గా ఆరెంజ్ ఆర్మీ, రన్నరప్గా నిజామాబాద్ స్టార్స్ నిలిచాయి.
ADB: జిల్లా కేంద్రం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నేడు(శనివారం)సీఎం కప్ పోటీల్లో భాగంగా ప్రభుత్వశాఖ ఉద్యోగులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా వారికి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు DYSO వెంకటేశ్వర్లు ప్రకటనలో తెలిపారు. వాలీబాల్, బ్యాడ్మింటన్, రన్నింగ్, టగ్-ఆఫ్-వార్, చెస్, క్యారం పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు పాల్గొనాలని కోరారు.
భారత క్రికెట్లో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ శకం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన అశ్విన్కు ఎంత మొత్తం పెన్షన్ వస్తుందనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది. కాగా, బీసీసీఐ లెక్కల ప్రకారం 106 టెస్టులు ఆడిన అశ్విన్కు నెలకు రూ. 70,000 పెన్షన్ అందనుంది.
టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వచ్చే ఏడాది ఆరంభంలోనే టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు ‘క్రిక్ బజ్’ ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించింది. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లోపు వాళ్లు రిటైర్మెంట్ ఇస్తారని అంచనా వేసింది. దీంతో వచ్చే ఏడాది నుంచి టీమిండియా కొత్తగా కనిపించనుందని తెలిపింది. కాగా ఇటీవల అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనతో రోహిత్, కోహ్లీ వ...
రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, డీన్ ఎల్గర్, డేవిడ్ వార్నర్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, జేమ్స్ అండర్సన్, శిఖర్ ధావన్, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, వేడ్, సాహా, సౌరభ్ తివారి, వరుణ్ ఆరోన్, మున్రో, డేవిడ్ వైస్, సిద్ధార్థ్ కౌల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. హెన్రిచ్ క్లాసెన్ (టెస్టులు), టీ20ల నుండి కోహ్లీ, రోహిత్, జడేజా, మహ్మదుల్లా తప్పుకున్నారు.
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అశ్విన్కు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ ఫోన్ చేసి విషెస్ చెప్పారని అశ్విన్ తెలిపారు. ఈ మేరకు కాల్ లిస్ట్ స్క్రీన్షాట్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన రిటైర్మెంట్ రోజు ఇలా జరుగుతుందని 25 ఏళ్ల క్రితం ఎవరైనా చెబితే అప్పుడు తనకు హార్ట్ ఎటాక్ వచ్చేద...
పృథ్వీ షాను విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లకు ఎంపిక చేయకపోవడంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 10 మంది ఫీల్డర్లతోనే ఆడామని పేర్కొంది. పృథ్వీ షా జట్టులో ఉన్న లేనట్లేనని తెలిపింది. బంతి పక్క నుంచి వెళుతున్న పృథ్వీ షా అందుకోలేడని ఎంసీఎ అధికారి వ్యాఖ్యానించారు.
టీమిండియాతో మిగిలిన రెండు టెస్టులకు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును వెల్లడించింది. ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (C), స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, సీన్ అబాట్, అలెక్స్ కెరీ, స్కాట్ బోలాండ్, జోష్ ఇంగ్లిస్, సామ్ కాన్స్టాస్, లబుషేన్, మిచెల్ మార్ష్, నాథన్ లియోన్, రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్.
JGL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలు- 2024లో భాగంగా సారంగాపూర్ మండలం రెచపల్లి గ్రామానికి చెందిన శ్రీ ప్రజ్ఞ రాష్ట్ర స్థాయి పోటీలకు బ్యాడ్మింటన్, కిక్ బాక్సింగ్ విభాగంలో ఎంపికైంది. ప్రస్తుతం ఆమె స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ప్రజ్ఞను పలువురు అభినందిస్తున్నారు.
SRPT: జిల్లాలోని మోతే మండల కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సిరికొండ గ్రామానికి చెందిన జంపాల గోపి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జిల్లా నుంచి 2025 Jan 12 న జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహం గురువుల శిక్షణ మూలంగా ఈ స్థాయికి ఎదిగానని అన్నారు.
SRD: రేపు ఉమ్మడి జిల్లా హాకీ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి ఖాసిం బేగ్ మీద తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీహెచ్ఈఎల్ లోని హాకీ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుందని, ఎంపికైన క్రీడాకారులు ఈనెల 27 నుంచి సీఎం కప్ హాకీ క్రీడా పోటీలో పాల్గొంటారని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ADB: ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నేడు (శుక్రవారం) టైక్వాండో, వూషూ, కిక్ బాక్సింగ్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. మండల స్థాయి పోటీల్లో అండర్ 14, 18 ముగించుకున్న వారు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. క్రీడాకారులు ఉదయం 10 గంటలకు స్టేడియంలో సెక్రెటరీ అన్నారపు వీరేష్కు రిపోర్ట్ చేయాలన్నారు.
మహిళల అండర్-19 ఆసియాకప్ టీ20 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 99 పరుగుల లక్ష్యాన్ని 14.5 ఓవర్లలో భారత్ ఛేదించింది. త్రిష 32, కమిలిని 28 పరుగులతో రాణించారు. ఇక శ్రీలంక బౌలర్లలో మునసింఘే 3, శశిని 2 వికెట్లు పడగొట్టారు.
NZB: నిజామాబాద్ నగరం కలెక్టర్ గ్రౌండ్లో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో కబడ్డీ విజేతగా రెంజల్ మండల జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్ రెంజల్ మండల జట్టు ఇండలవై జట్టుతో తలపడింది. మౌలాలి తండాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. జట్టుకు కోచ్గా పీడీ కృష్ణమూర్తి, జిల్లా కబడ్డీ కోచ్ ప్రశాంత్, తదితరులు అభినందించారు.