JGL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలు- 2024లో భాగంగా సారంగాపూర్ మండలం రెచపల్లి గ్రామానికి చెందిన శ్రీ ప్రజ్ఞ రాష్ట్ర స్థాయి పోటీలకు బ్యాడ్మింటన్, కిక్ బాక్సింగ్ విభాగంలో ఎంపికైంది. ప్రస్తుతం ఆమె స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ప్రజ్ఞను పలువురు అభినందిస్తున్నారు.
SRPT: జిల్లాలోని మోతే మండల కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సిరికొండ గ్రామానికి చెందిన జంపాల గోపి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జిల్లా నుంచి 2025 Jan 12 న జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహం గురువుల శిక్షణ మూలంగా ఈ స్థాయికి ఎదిగానని అన్నారు.
SRD: రేపు ఉమ్మడి జిల్లా హాకీ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి ఖాసిం బేగ్ మీద తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీహెచ్ఈఎల్ లోని హాకీ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుందని, ఎంపికైన క్రీడాకారులు ఈనెల 27 నుంచి సీఎం కప్ హాకీ క్రీడా పోటీలో పాల్గొంటారని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ADB: ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నేడు (శుక్రవారం) టైక్వాండో, వూషూ, కిక్ బాక్సింగ్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. మండల స్థాయి పోటీల్లో అండర్ 14, 18 ముగించుకున్న వారు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. క్రీడాకారులు ఉదయం 10 గంటలకు స్టేడియంలో సెక్రెటరీ అన్నారపు వీరేష్కు రిపోర్ట్ చేయాలన్నారు.
మహిళల అండర్-19 ఆసియాకప్ టీ20 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 99 పరుగుల లక్ష్యాన్ని 14.5 ఓవర్లలో భారత్ ఛేదించింది. త్రిష 32, కమిలిని 28 పరుగులతో రాణించారు. ఇక శ్రీలంక బౌలర్లలో మునసింఘే 3, శశిని 2 వికెట్లు పడగొట్టారు.
NZB: నిజామాబాద్ నగరం కలెక్టర్ గ్రౌండ్లో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో కబడ్డీ విజేతగా రెంజల్ మండల జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్ రెంజల్ మండల జట్టు ఇండలవై జట్టుతో తలపడింది. మౌలాలి తండాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. జట్టుకు కోచ్గా పీడీ కృష్ణమూర్తి, జిల్లా కబడ్డీ కోచ్ ప్రశాంత్, తదితరులు అభినందించారు.
ADB: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మధుప్రియ చదరంగంలో జిల్లా స్థాయిలో మొదటి బహుమతి కలెక్టర్ చేతుల మీదుగా అందుకొని రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు అభినందించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు.
MDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 జిల్లా స్థాయి పోటీలలో నాలుగవ రోజు బాలురు మరియు బాలికల విభాగంలో అథ్లెటిక్ మరియు షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. రెండు క్రీడలలో కలిపి మొత్తం 400 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. పోటీల ముగింపు సమావేశానికి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి నాగరాజు బహుమతులను అందజేశారు.
అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ తగిన వీడ్కోలుకు అర్హుడని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పేర్కొన్నాడు. భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన అశ్విన్ ఇలా ఆటను వదలడం షాక్కు గురిచేసిందని తెలిపాడు. అశ్విన్ ముఖంలో ఆవేదన కనిపించిందని.. అతను బాధతో ఉన్నాడని వ్యాఖ్యానించాడు. భారత క్రికెట్కు అతను చేసిన అపారమైన కృషికి ఇంకెవరూ సరిపోరని కొనియాడాడు. అశ్విన్కు BCCI ఘనమైన వీడ...
TPT: త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి దివ్యాంగ క్రికెట్ పోటీలకు ఆసక్తిగల అభ్యర్థులు శుక్రవారం లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ కమిటీ చైర్మన్ సూర్యనారాయణ తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, దివ్యాంగ క్రికెట్ కమిటీ, ఏపీ దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం 9985882559 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
సంగారెడ్డి కలెక్టరేట్లోని ఇండోర్ మైదానంలో సీఎం కప్ క్రీడల్లో భాగంగా అండర్-19 మిక్స్డ్ డబుల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో అక్షయ, ఖలీల్ గురువారం గోల్డ్ మెడల్ సాధించారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా తరఫున ఎంపికయ్యారు. వీరిని కోచ్ శరత్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయిలో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
వన్డే క్రికెట్లో ఆఫ్గానిస్థాన్ చరిత్ర సృష్టించింది. హరారే వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలో జింబాబ్వేపై 232 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. దీంతో వన్డే క్రికెట్లో అతి పెద్ద విజయం సాధించిన జట్టుగా ఆఫ్గానిస్థాన్ రికార్డు నెలకొల్పింది. ఇంతకు ముందు ఈ రికార్డు భారత్ ఖాతాలో ఉంది.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత లండన్లో స్థిరపడతాడని సమాచారం. తన భార్య, పిల్లలతో కలిసి యూకేలోనే ఉంటాడట. ఈ విషయాన్ని కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా కోహ్లీ తరచూ లండన్లో పర్యటనకు వెళ్లడం దీనికి బలం చేకూరుస్తోంది. కోహ్లీ, అనుష్క దంపతుల కుమారుడు లండన్లోనే జన్మించాడు. అక్కడ కోహ్లీకి ఆస్తులు ఉన్నాయి.
టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అశ్విన్ను కొంతకాలంగా వేధిస్తున్నారని తెలిపారు. అశ్విన్ రిటైర్మెంట్కు వేధింపులే కారణమని చెప్పారు. తన కుమారుడు రిటైర్మెంట్ నిర్ణయంతో తామంతా షాక్ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అంతర్జాతీయ క్రికెట్కు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం బ్రిస్బేన్ నుంచి భారత్కు బయల్దేరిన అశ్విన్.. స్వదేశానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. వీలైనంత ఎక్కువ కాలం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు. కాగా, ఐపీఎల్ మెగా ఆక్షన్లో అశ్వీన్ను రూ.9 కోట్ల CSK దక్కించుకుంది.