T20 WC 2026 నుంచి పాకిస్తాన్ నిష్క్రమించిన తీరుపై ఆ దేశ క్రికెటర్ రషీద్ లతీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ సల్మాన్ ఆఘాకు కెప్టెన్సీపై అవగాహన లేకపోవడమే జట్టు ఓటమికి ప్రధాన కారణమని తెలిపాడు. బౌలర్లను అతను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడని మండిపడ్డాడు. ఒకవేళ ఈ కెప్టెన్కు వసీం అక్రమ్, అక్తర్ వంటి దిగ్గజాలను ఇచ్చినా సరే మ్యాచ్ను ఓడించేస్తాడని వ్యాఖ్యానించాడు.