KNR: గుండ్లపల్లి–పొత్తూరు రహదారి ప్రమాదకరంగా ఉందని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల వేళ హామీలు ఇవ్వడం, శంకుస్థాపనలు చేయడమే తప్ప, ప్రజలకు కష్టాలు తప్పడం లేదని ఆయన మండిపడ్డారు. 100 రోజుల్లో రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, ఉన్న రహదారిపై కంకర పోసి వదిలేశారని, దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు.