అన్నమయ్య: APSPDCL పరిధిలో నకిలీ ఐటీఐ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వ్యవహారం వెలుగులోకి రావడంతో సంచలనం రేపుతోంది. ఉమ్మడి చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలువురు ఫేక్ సర్టిఫికెట్లతో నియమితులైనట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తం 69 మంది షిఫ్ట్ ఆపరేటర్లను సేవల నుంచి తొలగిస్తూ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి ఉత్తర్వులు జారీ చేశారు.