KNR: జమ్మికుంట మండలంలో ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మికుంట నుంచి HZB మండలం పోతిరెడ్డిపేటకు వెళ్తున్న ఆటో పెద్దంపల్లి మూల మలుపు వద్ద అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తేలుకుంట్ల శ్రీనివాస్ మృతి చెందాడు. ఆటోలో డ్రైవర్ ఒక్కడే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.