AKP: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా చేస్తున్న దాడులను తక్షణమే ఆపేయాలని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం ఎ. మాధవరావు డిమాండ్ చేశారు. మంగళవారం ప్రపంచం శాంతిని కోరుతూ అనకాపల్లి పట్టణం సీపీఐ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం యుద్ధంలో కన్నుమూసిన మానవాళికి అశ్రృ నివాళులర్పించారు.