ASF: తిర్యాణి మండలంలో SP నితికా పంత్ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా SI వెంకటేష్ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.