KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు కాంగ్రెస్ గ్రామ యూత్ అధ్యక్షుడు ఎడ్ల రాజు (35) అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తుండగా, చికిత్స పొందుతూ ఆయన మంగళవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువ నాయకుడు మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ జెండా కప్పి అంత్యక్రియలు నిర్వహించారు.