NGKL: వట్టెంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీమన్నారాయణ చార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య గరుడ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉత్సవమూర్తులకు పల్లకి సేవ నిర్వహించి, భక్తులకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు.