టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోనీ తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకున్నాడు. సతీమణి సాక్షి, కూతురు జీవాతో శాంటాక్లాజ్ గెటప్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ధోనీకి కూతురు జీవా ఆప్యాయంగా ముద్దుపెట్టిన ఫొటోలు వైరల్గా మారాయి.
భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ర్యాంకింగ్స్లో తన నంబర్ 1 స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో బుమ్రా (904) పాయింట్లతో టాప్లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్స్ సాధించిన భారత బౌలర్గా ఆశ్విన్ రికార్డును సమం చేశాడు. కాగా, అశ్విన్ 2016లో ఈ ఘనత సాధించాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ దేశవాళీ క్రికెట్లో రికార్డు నమోదు చేశాడు. టీ20, వన్డే మ్యాచుల్లో 50 వికెట్లు తీసిన మైలురాయిని చేరుకున్నాడు. 41 మ్యాచుల్లో 51 వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు.
రేపటి నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. గత రెండు టెస్టుల్లో మిడిలార్డర్లో ఆడి దారుణంగా విఫలమవడంతో రేపటి మ్యాచ్లో జైస్వాల్తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. దీంతో ఫామ్లో ఉన్న రాహుల్ వన్ డౌన్ ఆడనున్నాడు. మరోవైపు నితీష్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
స్టార్ షట్లర్ పీవీ సింధు ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తన భర్త వెంకట దత్త సాయితో తన ప్రేమ గురించి పలు ముచ్చట్లు మీడియాతో పంచుకుంది. వెంకట సాయి దత్తను చూడాగానే ప్రేమలో పడిపోయానని వెల్లడించింది. రెండేళ్ల క్రితం తనతో చేసిన విమాన ప్రయాణంతోనే తమ లవ్ స్టోరీ స్టార్ట్ అయిందని చెప్పింది. ఆ క్షణం లవ్ ఎట్ ఫస్ట్ సైట్లా అనిపించిందని పేర్కొంది.
పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజామ్ను కోహ్లీతో పోలుస్తూ తాను పెట్టిన పోస్టుపై పాక్ క్రికెటర్ ఫకర్ జమాన్ స్పందించాడు. తన ట్వీట్ను తప్పుగా అర్థం చేసుకున్నారని, PCBని విమర్శించలేదని చెప్పాడు. అది కేవలం తన అభిప్రాయమని, బాబర్కు మద్దతుగా పోస్ట్ పెట్టానని తెలిపాడు. కాగా, గతంలో బాబర్ను పక్కన పెడుతూ PCB తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ అతను పోస్టు పెట్టాడు.
విరాట్, స్మిత్లపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. మెల్బోర్న్లో జరిగే నాలుగో టెస్టులో వారిద్దరూ రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ ప్రస్తుతం విరాట్, స్మిత్ నిలకడలేని ఆటతీరుతో ర్యాకింగ్స్లో పడిపోయారు. ఇప్పటికీ వారు పరుగుల దాహంతో ఉన్నారు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నారంటే భారీ ఇన్నింగ్స్లు ఆడగలరు’ అని పేర్కొన్నాడు.
మెల్బోర్న్ వేదికగా రేపు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు 43 బాక్సింగ్ డే టెస్టులు జరగగా.. ఆసీస్ (26), టీమిండియా (9)మ్యాచులను గెలిచాయి. అయితే వరుసగా 2018, 2020లో భారత్ గెలిచింది. దీంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్లోనూ భారత్ గెలిచి.. హ్యాట్రిక్ కొడుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
టీమిండియాతో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు రెండు మార్పులతో కూడిన తుది జట్టును ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ప్రకటించాడు. ఇందులో శామ్ కాన్స్టాస్, బోలాండ్లు చోటు దక్కించుకున్నారు.జట్టు: ఖవాజా, శామ్ కాన్స్టాప్, లబుషెన్, స్మిత్,హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ(WK), పాట్ కమ్మిన్స్(C), స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
భారత స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తండ్రయ్యాడు. అతడి సతీమణి మేహా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అక్షర్ పంచుకున్నాడు. అయితే ఐదు రోజుల క్రితమే తనకు కొడుకు పుట్టాడని తెలిపాడు. తనకి ‘హక్ష పటేల్’ అని పేరు పెట్టిన్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా తన కుమారుడికి టీమిండియా జెర్సీ వేసిన ఫోటోను షేర్ చేశాడు.
భారత స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తండ్రయ్యాడు. అతడి సతీమణి మేహా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అక్షర్ పంచుకున్నాడు. అయితే ఐదు రోజుల క్రితమే తనకు కొడుకు పుట్టాడని తెలిపాడు. తనకి ‘హక్ష పటేల్’ అని పేరు పెట్టిన్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా తన కుమారుడికి టీమిండియా జెర్సీ వేసిన ఫోటోను షేర్ చేశాడు.
MBNR: పాలమూరు యూనివర్సిటీ క్రికెట్ పురుషుల విభాగంలో క్రీడాకారులను సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు ఎంపికలు నిర్వహించినట్లు యూనివర్సిటీ పీడీ వై.శ్రీనివాసులు బుధవారం తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉపకులపతి ప్రో. శ్రీనివాస్, రిజిస్ట్రార్ చెన్నప్ప, OSD మధుసుదన్ రెడ్డి, క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్, అబ్దుల్లా పాల్గొన్నారు.
ఆస్ట్రేలియా పర్యటనకు భారత పేసర్ షమీ దూరమవడంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. షమీని జట్టు నుంచి మినహాయిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని చోప్రా సమర్థించాడు. జట్టు పరంగా ఆలోచించినప్పుడు ఈ నిర్ణయం సరైందేనంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
‘ఖేల్ రత్న’ నామినేషన్లలో వివక్షపై మరో ఛాంపియన్ ఆరోపణలు చేశారు. పారా ఒలింపియన్లను గుర్తించడం లేదంటూ పారా ఆర్చర్ హర్విందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హర్విందర.. ఈ ఏడాది పారిస్ పారాలింపిక్స్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించారు. అథ్లెట్ మను బాకర్ నామినేషన్ వివాదం వేళ ఈ పారా ఆర్చర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
SKLM: రాష్ట్రస్థాయి సీనియర్ వాలీబాల్ క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 27న జరగనున్నాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానానికి ఆరోజు ఉదయం హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 95051 33888 నంబరును సంప్రదించాలని కోరారు.