బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ ఐదో రోజు ఆటలో భారత్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కేవలం 33 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ల దాటికి ఆసీస్ బ్యాటర్లు మెక్స్వీనీ (4), ఖవాజా (8), లబుషేన్(1), మార్ష్ (2), స్మీత్ (4) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. బుమ్రా, ఆకాష్ దీప్ చెరో రెండు వికెట్లు.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఫాలోఆన్ నుంచి తప్పించుకోవడంపై ఆసీస్ జట్టు సహాయక కోచ్ డానియల్ వెటోరీ స్పందించాడు. ‘భారత్ను ఎలాగైనా ఫాలోఆన్ ఆడించాలని అనుకున్నాం. జడేజా ఔట్ అయినప్పుడు మంచి అవకాశం కనిపించింది. ఆఖరి వికెట్ తీయడానికి తీవ్రంగా ప్రయత్నించాం. కానీ బుమ్రా, ఆకాశ్ దీప్లు విలువైన భాగస్వామ్యం నెలకొల్పి మా ఆశలపై నీళ్లు చల్లారు’ అని పేర్కొన్నాడు.
ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం మైదానంలో ఈ నెల 19 నుంచి రెండు రోజుల పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థాయి జూడో బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎంఆర్డీ బలరామ్, మార్లపూడి బాలరాజు మంగళవారం తెలిపారు. పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 20 నుంచి 22 వరకు గుంటూరు ఏఎన్ యూలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు.
NGKL: కల్వకుర్తిలో ఈనెల 22న రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ పోటీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి స్వాములు తెలిపారు. 10వ రాష్ట్ర క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ పోటీల్లో 16-20 ఏళ్ల వయస్సులోపు యువతీ, యువకులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు.
బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 252/9 ఓవర్ నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన టీమిండియా 260 పరుగులకు ఆలౌట్ అయింది. KL రాహుల్ (84), జడేజా(77) రాణించారు. చివర్లో ఆకాశ్ దీప్(31) పరుగులతో జట్టును ఆదుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్(4), స్టార్క్(3), హెజిల్వుడ్, హెడ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, భారత్ 185 పరుగుల వెనుకంజలో ఉంది.
RR: రంగారెడ్డిలో జిల్లా స్థాయి ఖోఖో టోర్నమెంట్ బుధవారం మహేశ్వరం మండలం తుక్కుగూడలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించనున్నట్లు తుక్కుగూడ ఫిజికల్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ టోర్నమెంట్లో జిల్లాలోని 27 మండలాలకు సంబంధించిన 1200 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పోటీలను కలెక్టర్ నారాయణరెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు.
పశ్చిమ గోదావరి జిల్లా దివ్యాంగుల క్రీడా ఫెడరేషన్ సభ్యులకు ఈ నెల 18, 19 డిసెంబర్ 2024న తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 3వ DEAF “T-20” క్రికెట్ టోర్నమెంట్ పోటీలకు హాజరుకానున్నారు. వారి ఖర్చుల నిమిత్తం తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆర్ధిక సహాయం క్రింద రూ. 24,000 అందించి, టోర్నమెంట్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
టీమిండియా యంగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిపై మాజీ ఆటగాడు గావస్కర్ ప్రశంశల జల్లు కురిపించాడు. నితీష్ తన వయసుకు మించిన పరిణితి ప్రదర్శించి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడని అన్నాడు. గబ్బా టెస్ట్ 4వ రోజు 61 బాల్స ఆడిన నితీష్ 16 పరుగులు చేశాడు. టెంపర్మెంట్ కారణంగా బాయ్ నుంచి మెన్గా ఎదుగుతున్నాడని పేర్కొన్నాడు.
వెస్టిండీస్ మహిళల జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. స్మృతీ మంధాన (62) అర్ధశతకం, రిచా ఘోష్ (32) పరుగులతో రాణించారు. ఇక విండీస్ బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్, డీన్డ్రా, ఎఫీ ఫ్లెచర్, హెన్రీ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు.
విజయ్ హజారే ట్రోఫీ కోసం మొదటి మూడు మ్యాచ్లకు సంబంధించి ముంబై జట్టును ప్రకటించింది. ఇందులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు. దీంతో ‘దేవుడా.. ఇంకెన్ని పరుగులు సాధించాలి’ అంటూ తన లిస్ట్ ఎ క్రికెట్ గణాంకాలను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ‘లిస్ట్ ఎ క్రికెట్లో 65 ఇన్నింగ్స్ల్లో 55.7 సగటుతో 3399 పరుగులు చేశా. నన్ను ఎంపిక చేయడానికి ఈ గణాంకాలు సరిపోవు. నేను తప్పకుండా ...
మహిళల వన్డే, టీ20 ర్యాంకింగ్స్ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్లో భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అదరగొట్టింది. వన్డేల్లో మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానంలో నిలిచింది. టీ20ల్లో ఒక స్థానం మెరుగై మూడో స్థానానికి చేరింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మంధాన సూపర్ సెంచరీ (105) చేసింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మెరుగ్గా రాణిస్తున్నాడు. ఓపెనర్గా తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. అలాగే, 2020 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై రోహిత్, కోహ్లీ, పంత్ కంటే మెరుగైన సగటు రికార్డు నమోదు చేసుకున్నాడు. గబ్బా టెస్టులోనూ కోహ్లీ, రోహిత్ కంటే మెరుగైన టెక్నిక్ ప్రదర్శించాడు. 139 బంతుల్లో 84 పరుగులు చేసిన రాహుల్.. సెంచరీ మిస్...
గబ్బా టెస్టులో భారత్కు ఫాలోఆన్ గండం తప్పింది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 445 పరుగులు చేయగా.. భారత్ 246 పరుగులు చేయడంతో ఫాలోఆన్ నుండి తప్పించుకుంది. అయితే బ్యాడ్ లైట్ కారణంగా నాలుగో రోజు ఆటను అంపైర్లు నిలిపివేశారు. భారత్ స్కోరు 252/9. క్రీజులో బుమ్రా(10*), ఆకాశ్ దీప్(27*) ఉన్నారు. కాగా, టీమిండియా 193 పరుగుల వెనుకంజలో ఉంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో ఘోర ప్రదర్శన చేస్తున్నాడు. బ్రిస్బేన్ టెస్టులోనూ 10 పరుగులకే పెవిలియన్ చేరడంతో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేశాడని.. బ్రిస్బేన్ టెస్టులో ఔటయ్యాక గ్లౌవ్స్ను డగౌట్ దగ్గర విడిచిపెట్టడం రిటైర్మెంట్ సంకేతాలను సూచిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా గత 14 టెస్ట్ ఇన్నింగ్స్లలో రోహిత్ ఒక్క హా...