• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు

NRML: రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన కనబరిచినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ప్రకటనలో తెలిపారు. వెయిట్ లిఫ్టింగ్ 77 కిలోల విభాగంలో సారంగాపూర్ కళాశాలకు చెందిన వర్షిని బంగారు పతకం,102 కిలోల విభాగంలో దస్తురాబాద్ మండలం ప్రభుత్వ పాఠశాలకు చెందిన అభిషేక్ కాంస్య పతకం సాధించినట్లు కలెక్టర్ తెలిపారు.

December 29, 2024 / 07:38 AM IST

AUS vs IND: లంచ్ బ్రేక్.. నిలకడగా ఆడుతోన్న ఆసీస్

ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్నటెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు తొలి సెషన్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ఉస్మాన్ ఖవాజా(21), కొన్‌స్టాప్(8) వికెట్లను కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 53/2  స్కోరు చేసింది. క్రీజులో లబుషేన్(20), స్మిత్(2) ఉన్నారు. బుమ్రా, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా 158 పరుగుల ఆధిక్యంలో ఉంది.

December 29, 2024 / 07:24 AM IST

టీమిండియా ఆలౌట్.. ఆధిక్యంలో ఆసీస్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో నాలుగో రోజు టీమిండియా 369 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ఆధిక్యం 105 పరుగులకు చేరింది. భారత బ్యాటర్లలో నితీష్ 114, జైస్వాల్ 82, సుందర్ 50 రన్స్‌తో రాణించారు. ఆసీస్ బౌలర్లలో కమీన్స్, బొలాండ్ లయన్‌కు తలో 3 వికెట్లు పడగొట్టారు. నిన్నటి స్కోర్‌కు కేవలం 11 పరుగులు మాత్రమే జోడించి భారత జట్టు ఆలౌట్ అయింది.

December 29, 2024 / 06:10 AM IST

రాష్ట్రస్థాయి కబడ్డీలో మెరిసిన విద్యార్థిని

WNP: అమరచింత మండల కేంద్రంలోని స్థానిక విజేత మోడల్ స్కూల్ విద్యార్థిని నిక్షిత ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన జూనియర్ కబడ్డీ మీట్‌లో చక్కటి ప్రతిభ కనబరిచి తృతీయ స్థానంలో నిలిచింది. శనివారం వనపర్తి జిల్లా కబడ్డీ సంఘం సెక్రటరీ రాము, అడిషనల్ సెక్రటరీ కురుమూర్తి క్రీడాకారిణి నిక్షితను సత్కరించి అభినందించారు.

December 29, 2024 / 06:04 AM IST

ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌.. భారత ప్లేయర్ నామినేట్

ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024 అవార్డుకు భారత క్రికెటర్ శ్రేయాంకా పాటిల్ నామినేట్ చేయబడింది. ఆమెతో పాటు సస్కియా హార్లీ(స్కాట్లాండ్), అన్నరీ డెర్క్‌సెన్(దక్షిణాఫ్రికా), ఫ్రెయా సార్జెంట్(ఐర్లాండ్) నామినేట్ అయ్యారు. మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్న తొలి భారతీయ క్రీడాకారిణిగా శ్రేయాంక డిసెంబర్ 2023లో చరిత్ర సృష్టించింది.

December 29, 2024 / 05:43 AM IST

చరిత్ర సృష్టించిన శ్రేయాంకా పాటిల్

ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024 అవార్డుకు భారత క్రికెటర్ శ్రేయాంకా పాటిల్ నామినేట్ చేయబడింది. ఆమెతో పాటు సస్కియా హార్లీ(స్కాట్లాండ్), అన్నరీ డెర్క్‌సెన్(దక్షిణాఫ్రికా), ఫ్రెయా సార్జెంట్(ఐర్లాండ్) నామినేట్ అయ్యారు. మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్న తొలి భారతీయ క్రీడాకారిణిగా శ్రేయాంక డిసెంబర్ 2023లో చరిత్ర సృష్టించింది.

December 29, 2024 / 05:43 AM IST

ఈనెల 30 నుంచి జనవరి 2 వరకు సీఎం కప్ ఖోఖో పోటీలు

PDPL: రాష్ట్రస్థాయి సీఎం కప్ ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు వరంగల్లో రిపోర్ట్ చేయాలని పెద్దపల్లి జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి సురేశ్ తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు పోటీలు జరుగుతాయన్నారు. పెద్దపల్లి జిల్లా తరఫున క్రీడాకారులకు టీషర్ట్స్, బస్సు పాసులు ఇస్తామన్నారు. వివరాలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

December 29, 2024 / 05:29 AM IST

రాష్ట్రస్థాయి ఖోఖోకు ఎంపికైన తంగళ్లపల్లి విద్యార్థిని

SRCL: సీఎం కప్ రాష్ట్రస్థాయి ఖోఖో జట్టుకు తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల మోడల్ స్కూల్ విద్యార్థిని జి. శరణ్య ఎంపికయింది. శనివారం శరణ్యను మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాధ, పీఈటీ స్వాతి, ఇతర అధ్యాపక బృందం అభినందించింది. ఇటీవల జరిగిన సీఎం కప్ జిల్లాస్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి ఖోఖో జట్టుకు శరణ్య ఎంపికైంది.

December 29, 2024 / 05:12 AM IST

రాష్ట్ర స్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపిక

KNR: శంకరపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు అనిల్, ప్రవీణ్, అర్చన, సాయితేజలు జిల్లాస్థాయిలో సాఫ్ట్ బాల్ పోటీల్లో విజేతలుగా నిలిచారు. ఈనెల 27-29 తేదీలలో మెదక్ జిల్లాలో రాష్ట్రస్థాయి సీఎం పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సరిత తెలిపారు. సరిత మాట్లాడుతూ.. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో గెలుపొంది మోడల్ స్కూల్ ప్రతిభను చాటాలన్నారు.

December 29, 2024 / 04:46 AM IST

నేడు సీఎం కప్ వాలీబాల్ ఫైనల్స్

ఖమ్మం: సీఎం కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ముగియనున్నట్లు డీవైఎస్ఓ సునీల్ రెడ్డి తెలిపారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో మూడు రోజులుగా ఆడిన జట్లు టైటిల్ బరిలో నిలిచాయి. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా పోటీలు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

December 29, 2024 / 04:39 AM IST

రసవత్తరంగా పాక్, సౌతాఫ్రికా తొలి టెస్టు

దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్ ఫలితం కోసం భారత్, ఆసీస్, శ్రీలంక ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే ఇందులో సౌతాఫ్రికా గెలిస్తే WTC ఫైనల్‌కు దూసుకెళ్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులకే ఆలౌట్ అయిన పాక్.. సౌతాఫ్రికాకు 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోర్ 27/3.

December 28, 2024 / 11:04 PM IST

నితీశ్‌.. ఆ విషయం గుర్తుంచుకోవాలి: గవాస్కర్

మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ చేసిన నితీశ్ రెడ్డిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. అతనికి మొదటి టెస్టు సెంచరీ, భవిష్యత్‌లో మరిన్ని పరుగులు సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. తల్లిదండ్రుల త్యాగాల వల్ల ఈ స్థాయికి చేరుకున్నాననే విషయాన్ని మర్చిపోవద్దని సూచించాడు. భవిష్యత్‌లోనూ ఇదే విధంగా ఆడితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

December 28, 2024 / 05:14 PM IST

తెలుగు క్రీడాకారుడికి నగదు ప్రోత్సాహకం

AP: ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివనాథ్‌ తెలుగు యువ క్రికెటర్ నితీశ్‌కు రూ.25 లక్షల ప్రోత్సాహం ప్రకటించారు. త్వరలోనే CM చంద్రబాబు చేతుల మీదుగా నగదు అందిస్తామని పేర్కొన్నారు. దేశంలోనే అత్యాధునిక వసతులతో అమరావతిలో స్టేడియాన్ని నిర్మిస్తామని చెప్పారు. IPL మ్యాచ్‌లు ఆడేలా విశాఖ స్టేడియం సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

December 28, 2024 / 02:35 PM IST

నితీష్.. ‘ది రియల్ గేమ్ ఛేంజర్’

BGT ట్రోఫీకి అనుభవం లేని నితీష్ ఎంపికపై చర్చలు జరిగాయి. ఎంపికైనా కూడా తుది జట్టులో ఉండకపోవచ్చనని అనుకున్నారంతా. కానీ మొదటి టెస్టులోనే ఛాన్స్ రావడంతో అందివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని ఈ సిరీస్‌లో 38, 41, 42, 42, 16 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. ఇవాళ్టి ఇన్నింగ్స్‌తో జట్టులో చోటు కష్టమనుకున్నా, అతడు రియల్ ‘గేమ్ ఛేంజర్’లా మారాడని పోస్టులు పెడుతున్నారు.

December 28, 2024 / 01:28 PM IST

AUS vs IND: ముగిసిన మూడో రోజు ఆట

బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. 164/5 వద్ద రోజు ఆట ప్రారంభించిన టీమిండియా కాసేపటికే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో క్రీజులో వచ్చిన సుందర్, నితీష్ కుమార్ రాణించడంతో భారత్ 359/9 స్కోర్ చేసింది. ప్రస్తుతం క్రీజులో నితీష్(105*), సిరాజ్(2*) ఉన్నారు. భారత్ ఇంకా 116 పరుగులు వెనకబడి ఉంది.

December 28, 2024 / 01:07 PM IST