JGL: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని, కళాధార పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు, హెచ్ఎం కమలాకర్, పీఈటి అజయ్ తెలిపారు. పాఠశాలకు చెందిన హైందవి, రిశ్వంత్, చరణ్ అనే విద్యార్థులు, మండల స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటడంతో, జిల్లా స్థాయికి ఎంపికైనట్లు వారు పేర్కొన్నారు.
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ 2025 ట్రోఫీని నిర్వహించనున్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డి అన్నారు. 2025 జనవరిలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నీ సందర్భంగా ఆయన నిజామాబాద్లోని పాలిటెక్నిక్ గ్రౌండ్ ను సందర్శించారు. సందర్భంగా టోర్నీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
SRCL: ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన కట్ట శ్రీవల్లి అండర్-19 క్రికెట్ మహిళా వన్డే హైదరాబాద్ జట్టుకు ఎంపికైంది. జనవరి 4 నుంచి 12 వరకు కేరళలోని త్రివేండ్రంలో జరిగే క్రికెట్ పోటీల్లో పాల్గొంటుందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. శ్రీవల్లి అండర్ -19 క్రికెట్ మహిళా వన్డే హైదరాబాద్ జట్టుకు ఎంపికైనందుకు తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.
తమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న రాహుల్ సోరెంగ్ విజయ్ మర్చంట్ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక కావడం గర్వంగా ఉందని.. దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. రాహుల్.. పుల్వామా ఘటనలో నింగికేగిన అమర వీరుడు విజయ్ సోరెంగ్ కుమారుడు. కాగా, కశ్మీర్లో 2019లో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పిల్లలకు తన పాఠశాలలో సెహ్వాగ్ ఉచితంగా విద్యనందించాడు.
రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే ఆసీస్తో టెస్టు సిరీస్లోనే ఆటకు వీడ్కోలు పలికాడు. కాగా, గతంలోనూ ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడిన తర్వాతనే పలువురు క్రికెటర్లు.. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అందులో అనిల్ కుంబ్లే, గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, ధోనీ ఉన్నారు.
SDPT: హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్సై జాన్ విల్సన్ స్మారకార్థం ఈనెల 21, 22, 23 తేదీల్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ వెనక ఉన్న ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 9963202414, 9640510668, 8106906577, 9441925763 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
అశ్విన్ రిటైర్మెంట్తో వన్డే ప్రపంచకప్ 2011 గెలిచిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే మిగిలాడు. ధోని సారథ్యంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లలో అందరూ ఇప్పటికే భారత జట్టుకు దూరమయ్యారు. ప్రస్తుతం కోహ్లీ ఒక్కడే మిగిలిపోయాడు. ఈ మేరకు అప్పటి జట్టులో కోహ్లీని మార్క్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం వన్డే క్రికెట్కు విరాట్ వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది.
ఐసీసీ బౌలర్ల ర్యాంకుల్లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (890 పాయింట్లు) అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 797 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైపు బ్యాటర్ల ర్యాంకుల్లో ఇంగ్లండ్ ఆటగాడు రూట్ టాప్-1లో ఉన్నాడు. టాప్-10లో భారత్ నుంచి జైస్వాల్ నాలుగో స్థానంలో, పంత్ 9వ స్థానంలో కొనసాగుతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్కు టీమిండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ ప్రకటించి అశ్విన్ తనను భావోద్వేగానికి గురిచేశాడంటూ విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ’14 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో కలిసి ఆడిన జ్ఞాపకాలు నా కళ్ల ముందు మెరిశాయి. నీతో చేసిన ప్రయాణంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను. ఇండియన్ క్రికెట్ లెజెండ్గ...
RR: పైప్లే పెడల్స్ టెన్నిస్ సిరీస్ మాస్టర్ టైటిల్ను ఆదిల్, రిషి రెడ్డి సొంతం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీ వేదికగా జరిగిన పైప్లే పెడల్ మాస్టర్ సిరీస్ ఫైనల్స్ ముగిశాయి. ఈ టోర్నమెంట్కు వివిధ ప్రాంతాల నుంచి 150 మంది మాస్టర్స్ పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన ఈ టోర్నమెంట్ డబుల్స్ ఆదిల్ కళ్యాణ్ పూర్ విజేతలుగా నిలిచారు.
బ్రిస్బేన్లో ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో టీమిండియా.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ చేరుకునే అవకాశాలు క్లిష్టంగా మారాయి. భారత్.. ఆసీస్తో మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలిస్తే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా WTC ఫైనల్ చేరుకుంటుంది. ప్రస్తుతం WTC ర్యాంకింగ్స్లో దక్షిణాఫ్రికా(1), ఆస్ట్రేలియా(2), భారత్(3) స్థానాల్లో...
KMM: జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ ఇండోర్ స్టేడియంలో బుధవారం జిల్లా స్థాయి సీఎం కప్పు క్రీడా పోటీలు జరిగాయి. గర్ల్స్ కబడ్డీ విభాగంలో మధిర పట్టణానికి చెందిన జట్టు జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి సాధించడం జరిగిందని సంబంధిత నిర్వాహకులు తెలియజేశారు. అదే విధంగా త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ క్రికెట్కు టీమిండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. గబ్బాలో ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. తన కెరీర్లో మొత్తం 106 టెస్టులు ఆడిన అశ్విన్ 537 వికెట్లు తీశాడు. బ్యాటింగ్లో 3503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 11 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్లు సాధించాడు. మరోవైపు 116 ...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో ఎంతో ఉత్కంఠగా సాగిన గబ్బా టెస్టు డ్రాగా ముగిసింది. వర్షం కారణంగా చివరి రోజు రెండు సెషన్ల ఆట సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ డ్రా అయినట్లు అంపైర్లు ప్రకటించారు. ఐదు టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా – భారత్ జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఆస్ట్రేలియా స్కోర్: 445& 89/7 భారత్ స్కోర్: 260& 8/0
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 89/7 పరుగుల వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్కు 185 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో భారత్ ముగింట 274 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరిరోజు ఆటకు ఇంకా 56 ఓవర్లు మిగిలి ఉన్నాయి.