టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త ఫామ్ కొనసాగుతోంది. గత రెండు టెస్టుల్లో మిడిలార్డర్లో బరిలోకి దిగి విఫలమవడంతో బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్గా దిగాడు. అయితే కమిన్స్ వేసిన తొలి ఓవర్లోనే చెత్త షాట్ ఆడి ఔట్ అయ్యాడు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్ కీలకంగా మారగా.. రోహిత్ ఫెయిల్ కావడంపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మెల్బోర్న్ వేదికగా భారత్తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాటర్లు కోన్స్టాస్ (60), ఖవాజా (57), లబుషేన్ (72) హాఫ్ సెంచరీలతో రాణించగా.. స్టీవెన్ స్మిత్ అద్భుత సెంచరీతో(140) మెరవడంతో 474 పరుగుల భారీ స్కోరుకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా 4, జడేజా 3, ఆకాశ్ 2 వికెట్లు, సుందర్ 1 వికెట్ పడగొట్టారు.
భారత్తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది. 311/6 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మొదటి నుంచి దూకుడుగా ఆడుతుంది. ఈ క్రమంలో స్మిత్ సూపర్ సెంచరీతో(139*) టెస్టుల్లో తన 34వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. క్రీజులో స్మిత్, స్టార్క్ ఉన్నారు. లంచ్ సమయానికి ఆసీస్ స్కోర్ 454/7.
ఆసీస్, భారత్ మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో తొలి రోజు ఆటలో ఆసీస్ బ్యాటర్లు లబుషేన్, కాన్స్టాస్ పిచ్పై నడిచారు. దీంతో ఆసీస్ ఆటగాళ్లపై భారత మాజీలు సునీల్ గావస్కర్, ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డారు. పిచ్పై నడవొద్దని రోహిత్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అంపైర్లు చేయాల్సిన పని రోహిత్ చేశాడని గావస్కర్, ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించారు.
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(MCG)లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్లో బుమ్రా సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తొలి రోజు ఆటలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో MCGలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు. MCGలో బుమ్రా మూడు మ్యాచ్లు ఆడి మొత్తం 18 వికెట్లు తీసుకున్నాడు. అంతకు ముందు అనిల్ కుంబ్లే(15) పేరిట ఈ రికార్డ్ ఉండేది.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఊరట లభించింది. బాక్సింగ్ డే మ్యాచ్ నిషేధం నుంచి విరాట్ తప్పించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో యువ ఆటగాడు కాన్ స్టాస్తో వివాదం నెలకొన్న వేళ కోహ్లీని ఒక మ్యాచ్ నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగింది. కాగా ఐసీసీ అతడి మ్యాచ్ ఫీజు నుంచి 20 శాతం కోత విధించింది.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా యువ ఆటగాడు కాన్స్టాస్తో కోహ్లీ వివాదంపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఓవర్ పూర్తయ్యాక పిచ్పై అవతలి ఎండ్ వైపు నడిచి వెళ్తున్న కాన్స్టాస్ను కోహ్లీ ఢీ కొట్టాడు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది. జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా కోహ్లీ ఖాతాలో చేరింది.
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్ (68), కమిన్స్ (8) ఉన్నారు. కొన్స్టాస్ (60), ఖవాజా (57), లబుషేన్ (72) రాణించారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.
బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. అతడు కావాలనే ఆస్ట్రేలియా అరంగేట్ర ఆటగాడు కొన్స్టాస్ను ఢీకొట్టాడని పలువురు తప్పుబడుతున్నారు. దీనిపై ICC చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కోహ్లీ తప్పు చేశాడని ఐసీసీ నిర్ధారిస్తే 3-4 డీ మెరిట్ పాయింట్లు ఇవ్వడంతో పాటు ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించే అవకాశం ఉంది.
కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ టెస్టుల్లో పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. తన ఫామ్పై మాట్లాడిన విరాట్.. గత 3 ఇన్నింగ్స్ల్లో అనుకున్న విధంగా ఆడలేకపోయానన్నాడు. మెల్బోర్న్ తనకు చాలా స్పెషల్.. ఇక్కడ చాలా పరుగులు చేశానని, తన ఆత్మగౌరవం కూడా దెబ్బతిన్నదన్నాడు. తిరిగి పుంజుకోవడానికి MCG సరైన వేదిక అని భావిస్తున్నానని పేర్కొన్నాడు.
మెల్బోర్న్లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్లో AUS ఆధిపత్యం చలాయించింది. ఓపెనర్ కొన్స్టస్ అరంగేట్రం మ్యాచులోనే బౌలర్లపై విరుచుకుపడుతూ సూపర్ ఫిఫ్టీ (60) సాధించాడు. బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తున్నా అతడు ఏకంగా బుమ్రా బౌలింగ్లో సిక్సర్ బాదడం గమనార్హం. క్రీజులో ఖవాజా (38), లబుషేన్(12) ఉన్నారు. లంచ్ సమయానికి AUS స్కోర్ 112/1.
మెల్బోర్న్లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్లో AUS ఆధిపత్యం చలాయించింది. ఓపెనర్ కొన్స్టస్ అరంగేట్రం మ్యాచులోనే బౌలర్లపై విరుచుకుపడుతూ సూపర్ ఫిఫ్టీ (60) సాధించాడు. బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తున్నా అతడు ఏకంగా బుమ్రా బౌలింగ్లో సిక్సర్ బాదడం గమనార్హం. క్రీజులో ఖవాజా (38), లబుషేన్(12) ఉన్నారు. లంచ్ సమయానికి AUS స్కోర్ 112/1.
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మట్కు వీడ్కోలు పలికాడు. అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో తన విరమణపై పలు అనుమానాలు వ్యక్తం అవ్వడంతో తాజాగా స్పందించాడు. తనకు ఎవరిపై కోపం లేదని, తన రిటైర్మెంట్కు ఎవరూ బాధ్యులు కాదని స్పష్టం చేశాడు.
SKLM: పిఠాపురంలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో సీనియర్ మెన్ బ్యాక్సింగ్ టోర్నమెంట్ జరిగింది. ఈ పోటీల్లో శ్రీకాకుళానికి చెందిన జ్ఞానేశ్వర్ రావు, అప్పలరాజు, హేమంత్ కుమార్ బంగారు పతకాలు సాధించారు. అలాగే వెండి పతకాలను విశేశ్వరరావు, లోకేష్, ఏసు, శ్రీకాంత్, మనోజ్ దక్కించుకున్నారు. ఈ మేరకు బుధవారం పథకాలు సాధించిన వారికి SKLM ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందించారు.
W.G: ఇంటర్ కాలేజియేట్ బెస్ట్ ఫిజిక్ టోర్నమెంట్లో పాలకొల్లు ఎఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి జగదీష్ ద్వితీయ స్థానం సాధించినట్లు ప్రిన్సిపల్ టి. రాజరాజేశ్వరి తెలిపారు. జగదీష్ రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఈనెల 21న జరిగిన ఇంటర్ కాలేజియేట్ బెస్ట్ ఫిజిక్ టోర్నమెంట్ పాల్గొని ప్రతిభ కనబర్చాడు. జగదీష్ ని ప్రిన్సిపల్ అభినంధించారు.