IPL- 2026 సీజన్ కోసం ‘జియోహాట్స్టార్’ తమ హిందీ కామెంట్రీ ప్యానల్ను ప్రకటించింది. అశ్విన్ తొలిసారిగా కామెంట్రీ బాక్స్లోకి అడుగుపెట్టబోతుండటం విశేషం. ఈ ప్యానల్లో సెహ్వాగ్, కుంబ్లే, హర్భజన్ వంటి దిగ్గజాలతో పాటు రైనా, ఇర్ఫాన్ పఠాన్, ఆకాష్ చోప్రా, పుజారా, చావ్లా, ఉమేష్ యాదవ్, ఆదిత్య తారే వంటి మాజీ క్రికెటర్లు ఉన్నారు.
IPL-2026 ఆరంభ మ్యాచ్లో RCB, SRH జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ కీలక పోరులో RCB స్టార్ పేసర్ జోష్ హెజెల్వుడ్ బరిలోకి దిగడం లేదని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ స్పష్టం చేశాడు. గాయం నుంచి కోలుకుని నిన్ననే జట్టుతో చేరినప్పటికీ, అతనికి మరింత విశ్రాంతి అవసరమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ పేసర్ అందుబాటులో లేకపోవడం RCB బౌలింగ్కు పెద్ద ఎదురుదెబ్బే.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న IPL పండుగ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 18 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న IPL, 19వ సీజన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 65 రోజుల పాటు 13 వేదికల్లో మొత్తం 84 మ్యాచ్లు జరగనున్నాయి. ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ RCBని SRH ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లను star sports, JioHotstar Appలో వీక్షించవచ్చు.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లలో మనీష్ పాండే ఒకడు. ఈ మెగా టోర్నీ ఆరంభం(2008) నుంచి ప్రతి సీజన్లోనూ పాండే ఏదో ఒక జట్టు తరఫున ఆడుతూనే ఉన్నాడు. IPL చరిత్రలో సెంచరీ సాధించిన తొలి భారతీయ ఆటగాడి రికార్డు అతడి పేరిటే ఉంది. 2009లో RCB తరఫున ఆడుతూ డెక్కన్ చార్జర్స్ మీద ఈ ఘనత సాధించాడు. ప్రస్తుత సీజన్లో పాండే KKR జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
వెస్టిండీస్ సీనియర్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదన్న అసహనంతో ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ క్రికెట్కు ప్రకటించిన వీడ్కోలును వెనక్కి తీసుకున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ దేశవాళీ టోర్నీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. లూయిస్ 67 వన్డేల్లో 2,175 పరుగులు, 65 టీ20 మ్యాచ్ల్లో 1,782 పరుగులు సాధించాడు.
స్పెయిన్ బ్యాడ్మింటన్ దిగ్గజం కరోలినా మారిన్ రిటైర్మెంట్ ప్రకటించింది. బ్యాడ్మింటన్లో తన ప్రయాణం ముగిసిందని ఆమె SM వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్ చేసింది. కొంతకాలంగా తనను వేధిస్తున్న మోకాలి గాయం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2016 రియో ఒలింపిక్స్లో సింధును ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించిన మారిన్, మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్గా కూడా నిలిచింది.
MI జట్టుకు మహ్మద్ కైఫ్ కీలక సూచనలు చేశాడు. పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ బాధ్యతలను సూర్యకు అప్పగించాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో కైఫ్ స్పందించాడు. పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించడం పెద్ద పొరపాటే అవుతుందని అభిప్రాయపడ్డాడు. అతడి కెప్టెన్సీలో MI ప్రదర్శన పడిపోయిన మాట వాస్తవమేనని అన్నాడు. అయితే ప్రస్తుతం కెప్టెన్గా పాండ్యా కుదురుకున్నాడని తెలిపాడు.
తాను స్వతహాగా బౌలింగ్ ఆల్రౌండర్ అయినప్పటికీ.. చాలా సందర్భాల్లో బ్యాటింగ్ ఆల్రౌండర్గానూ ఆడానని టీమిండియా & RCB ప్లేయర్ కృనాల్ పాండ్యా పేర్కొన్నాడు. చాలా మంది తనను బౌలర్గానే చూస్తున్నారని, నిజానికి తనకు బ్యాటింగ్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. గత IPLలో ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్గా నిలిచిన పాండ్యా.. భారత్ తరఫున ఆడి దాదాపు ఐదేళ్లు అవుతోంది.
న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ కెప్టెన్ అమెలియా కెర్, మెన్స్ టీమ్ బౌలర్ జాకబ్ డఫ్పీ ‘న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2025’ అవార్డ్ అందుకున్నారు. డఫ్పీకి ఇది తొలి అవార్డ్ కాగా.. కెర్కి వరుసగా 4వ పురస్కారం కావడం విశేషం. టెస్ట్ ప్లేయర్-2025 కూడా డఫ్పీనే అందుకోగా.. కెర్ ఉమెన్స్ T20 ప్లేయర్గా నిలిచింది.
IPL 2026లో అభిషేక్ నాయర్ KKRకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘IPL హెడ్ కోచ్గా అభిషేక్కి ఇది తొలి సీజన్. WPLలో UPWకు హెడ్ కోచ్, టీమిండియా బ్యాటింగ్ కోచ్గా చేసిన అనుభవం ఉన్నా.. IPL పూర్తిగా వేరే. సరైన కెప్టెన్ కూడా లేని KKR అతనికి చాలా పెద్ద అసైన్మెంట్. ఏం చేస్తాడో చూడాలి’ అన్నాడు.
IPLలో ఒకే మ్యాచులో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా CSK మాజీ ప్లేయర్ మురళీ విజయ్ కొనసాగుతున్నాడు. 2020లో RRపై అతను 56 బంతుల్లోనే 127 రన్స్ చేసే క్రమంలో ఈ రికార్డ్ నెలకొల్పాడు. 2018లో శాంసన్, 2023లో గిల్, 2025లో అభిషేక్ పదేసి సిక్సర్లతో రాణించారు కానీ విజయ్ రికార్డ్ అందుకోలేకపోయారు. ఓవరాల్గా గేల్(2013లో 17), బ్రెండన్ మెకలమ్(2008లో 13) తొలి 2 స్థానాల్లో ఉన్నారు.
జింబాబ్వే 3 వన్డేల సిరీస్ కోసం 2027 జనవరిలో భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా 2002 తర్వాత భారత పర్యటనకు జింబాబ్వే రావడం ఇదే తొలిసారి. నాడు జింబాబ్వేపై భారత్ 2-0తో టెస్ట్ , 3-2తో వన్డే సిరీస్లను సొంతం చేసుకుంది. కాగా ఇరుజట్ల మధ్య జరిగిన గత 4 వన్డే సిరీస్(2013, 2015, 2016, 2022)ల్లోనూ జింబాబ్వే తమ సొంతగడ్డపైనే వైట్ వాష్ అయ్యింది.