దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్ ఫలితం కోసం భారత్, ఆసీస్, శ్రీలంక ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే ఇందులో సౌతాఫ్రికా గెలిస్తే WTC ఫైనల్కు దూసుకెళ్తుంది. రెండో ఇన్నింగ్స్లో 237 పరుగులకే ఆలౌట్ అయిన పాక్.. సౌతాఫ్రికాకు 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోర్ 27/3.
మెల్బోర్న్ టెస్టులో సెంచరీ చేసిన నితీశ్ రెడ్డిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. అతనికి మొదటి టెస్టు సెంచరీ, భవిష్యత్లో మరిన్ని పరుగులు సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. తల్లిదండ్రుల త్యాగాల వల్ల ఈ స్థాయికి చేరుకున్నాననే విషయాన్ని మర్చిపోవద్దని సూచించాడు. భవిష్యత్లోనూ ఇదే విధంగా ఆడితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
AP: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివనాథ్ తెలుగు యువ క్రికెటర్ నితీశ్కు రూ.25 లక్షల ప్రోత్సాహం ప్రకటించారు. త్వరలోనే CM చంద్రబాబు చేతుల మీదుగా నగదు అందిస్తామని పేర్కొన్నారు. దేశంలోనే అత్యాధునిక వసతులతో అమరావతిలో స్టేడియాన్ని నిర్మిస్తామని చెప్పారు. IPL మ్యాచ్లు ఆడేలా విశాఖ స్టేడియం సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
BGT ట్రోఫీకి అనుభవం లేని నితీష్ ఎంపికపై చర్చలు జరిగాయి. ఎంపికైనా కూడా తుది జట్టులో ఉండకపోవచ్చనని అనుకున్నారంతా. కానీ మొదటి టెస్టులోనే ఛాన్స్ రావడంతో అందివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని ఈ సిరీస్లో 38, 41, 42, 42, 16 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. ఇవాళ్టి ఇన్నింగ్స్తో జట్టులో చోటు కష్టమనుకున్నా, అతడు రియల్ ‘గేమ్ ఛేంజర్’లా మారాడని పోస్టులు పెడుతున్నారు.
బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. 164/5 వద్ద రోజు ఆట ప్రారంభించిన టీమిండియా కాసేపటికే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో క్రీజులో వచ్చిన సుందర్, నితీష్ కుమార్ రాణించడంతో భారత్ 359/9 స్కోర్ చేసింది. ప్రస్తుతం క్రీజులో నితీష్(105*), సిరాజ్(2*) ఉన్నారు. భారత్ ఇంకా 116 పరుగులు వెనకబడి ఉంది.
తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆసీస్ గడ్డపై చెలరేగుతున్నాడు. తనకు ఇది మొదటి సిరీస్ అయినా ఏ మాత్రం భయం లేకుండా ఆ జట్టు స్టార్ పేసర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో నితీష్ తన తొలి టెస్టు సెంచరీ సాధించాడు. నితీష్ సెంచరీ చేయగానే.. మైదానంలో తన తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 354/9.
బాక్సింగ్ డే టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి సూపర్ ఫిఫ్టీ(54*) సాధించాడు. 6 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన నితీష్.. 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. నితీష్ గత మ్యాచుల్లో 40 ప్లస్ పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఎట్టకేలకు ఇవాళ టెస్టుల్లో తన మొదటి హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 274/7.
భారత్ మరో వికెట్ను కోల్పోయింది. నాథన్ లైయన్ బౌలింగ్లో LBగా జడేజా (17) పెవిలియన్కు చేరాడు. DRS తీసుకున్నా భారత్కు సానుకూల ఫలితం రాలేదు. సమీక్షలో ‘అంపైర్స్ కాల్’ నిర్ణయం రావడంతో నిరాశగా జడేజా డగౌట్కు వెళ్లాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 222/7. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 53 పరుగులు అవసరం.
కోనసీమ: అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో బీచ్ వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శుక్రవారం జరిగిన వాలీబాల్ మ్యాచ్లో మొదటి ఆటగా గోవా, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడ్డాయి. హోరా హోరీగా జరిగిన ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు విజయం సాధించింది. విద్యుత్ ద్వీపాల వెలుగులలో పోటీలు జరుగుతున్నాయి.
KNR: క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ బొమ్మకల్లో ఎల్పిఎల్ లీగ్ పోటీల ముగింపు సమావేశంలో అయన పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ట్రోపీలను, నగదును ఆయన అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు.
KNR: చొప్పదండి మండలం రాగంపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో, 7వ తరగతి చదువుతున్న ఉడుత రిత్విక అనే విద్యార్థిని, సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఈ నెల 29 వరకు సరూర్ నగర్లో జరిగే ఆట్య పాట్య ఛాంపియన్ షిప్లో ఆమె పాల్గొంటున్నారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు.
KNR: సీఎం కప్ పోటీలలో భాగంగా కరీంనగర్లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జూడో రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ప్రారంభించే ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పిస్తూ సంతాపం ప్రకటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పోటీలను ఒలంపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి జనార్దన్ రెడ్డి, జిల్లా క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్ ప్రారంభించారు.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ(140) బాదడంతో భారత్పై ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ ఇప్పటి వరకు భారత్పై 43 ఇన్నింగ్స్లు ఆడి 11 టెస్టు సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 10 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ(140) బాదడంతో భారత్పై ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ ఇప్పటి వరకు భారత్పై 43 ఇన్నింగ్స్లు ఆడి 11 టెస్టు సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 10 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ(140) బాదడంతో భారత్పై ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ ఇప్పటి వరకు భారత్పై 43 ఇన్నింగ్స్లు ఆడి 11 టెస్టు సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 10 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.