IPL 2026లో భాగంగా కాసేపట్లో RCB, SRH మధ్య తొలి పోరు జరగనుంది. నూతన సారథి ఇషాన్ కిషన్ నాయకత్వంలో SRH బరిలోకి దిగుతోంది. అయితే, భారీ బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్రైజర్స్.. బౌలింగ్లో బలహీనంగా ఉంది. SRH కనీసం 230+ స్కోర్లు చేస్తేనే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఓ మాదిరి స్కోరు చేస్తే దానిని కాపాడుకునేంత బౌలింగ్ యూనిట్ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
IPL 2026లో భాగంగా ఈరోజు RCBతో SRH తలపడనుంది. అయితే, 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ గతేడాది IPL టైటిల్ను RCB కైవసం చేసుకుంది. ఇప్పుడూ అదే జోరుతో ఈ సీజన్ను విజయంతో ఆరంభించాలని బరిలోకి దిగుతోంది. మరోవైపు భారీ బ్యాటింగ్ లైనప్ కలిగిన SRH.. టోర్నీని శుభారంభం చేయాలని భావిస్తోంది. మరి ఈ రెండు జట్లలో ఏది మ్యాచ్ గెలుస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
బ్యాడ్మింటన్ దిగ్గజం కరోలినా మారిన్ రిటైర్మెంట్ ప్రకటనపై భారత స్టార్ షట్లర్ పీవీ సింధు భావోద్వేగ ట్వీట్ చేసింది. కొందరు ప్రత్యర్థులు మన ప్రయాణంలో భాగమవుతారని.. అలాంటి వారిలో కరోలినా ఒకరని తెలిపింది. కోర్టులో తన ప్రవర్తన, అరుపుల వల్ల తనకు చాలా కోపం వచ్చేదని.. కానీ తర్వాత పరస్పరం గౌరవించుకున్నామని చెప్పింది. బ్యాడ్మింటన్ ప్రపంచం మారిన్ ఆటను మరిచిపోదని సింధు చెప్పుకొచ్చింది.
పంజాబ్ సీఎం మరియం నవాజ్పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ చేసినందుకు పాక్ క్రికెటర్ నసీమ్ షా చిక్కుల్లో పడ్డాడు. తన ఖాతా హ్యాక్ అయిందని నసీమ్ వివరణ ఇచ్చినప్పటికీ, నిబంధనల ఉల్లంఘన కింద పీసీబీ అతనికి షోకాజ్ నోటీసు ఇచ్చింది. భద్రతా ఆంక్షల నడుమ PSL సాగుతుండగా, ఈ ఘటన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రెండుసార్లు ఒలింపిక్ పతకం గెలిచిన భారత హాకీ జట్టులో సభ్యుడైన గుర్జంత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాది వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైన గుర్జంత్.. తర్వాత మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడు. 2017లో అరంగేట్రం చేసిన అతడు 130 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 33 గోల్స్ కొట్టాడు. హాకీకి వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయమని భావించినట్లు గుర్జంత్ పేర్కొన్నాడు.
ఇషాన్ కిషన్కు జట్టు పగ్గాలు అప్పగించడంపై కోచ్ డానియల్ వెటోరీ స్పందించాడు. తప్పకుండా అతడికిచ్చిన బాధ్యతలను మెరుగ్గా నిర్వర్తిస్తాడని భావిస్తున్నట్లు తెలిపాడు. ‘IPLలో ఇషాన్ విజయవంతంగా కొనసాగుతున్నాడు. అండర్-19 జట్టుతోపాటు ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన టీమ్ను నడిపించాడు. విజేతగా నిలిపాడు. అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ భాగస్వామ్యం బాగుంటుంది’ అని వెల్లడించాడు.
IPL 2026లో SRH కెప్టెన్సీ పగ్గాలను ఇషాన్ కిషన్ను అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను ఇషాన్ తన ఖాతాలో వేసుకున్నాడు. IPL చరిత్రలో సన్రైజర్స్కు అతిపిన్న వయసులో సారథ్యం చేపట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్గా రెండో పిన్న వయస్కుడు కావడం గమనార్హం. 2018లో కేన్ విలియమ్సన్ 27 ఏళ్ల 244 రోజుల వయసులో SRH కెప్టెన్సీని అందుకున్నాడు.
IPL 2026 సీజన్కు రంగం సిద్ధమైంది. అయితే, అబ్రార్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంతో ఇటీవల సన్గ్రూప్పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎఫెక్ట్ ఏమైనా ఇప్పుడు SRHపై పడుతుందా? అని పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే, అలాటిందేమీ ఉండదని భారత మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా తెలిపింది. అతడేమీ భారత్కు రావడంలేదు కదా అని చెప్పుకొచ్చింది.
చిన్నస్వామి స్టేడియం వేదికగా SRHతో RCB జట్టు తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కర్ణాటక క్రికెట్ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రారంభ మ్యాచ్ కోసం ఒక స్టాండ్ మొత్తాన్ని కర్ణాటక ఎమ్మెల్యేల కోసం కేటాయిస్తున్నట్లు సమాచారం. అలాగే, గతేడాది తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన 11 మందికి గుర్తుగా ప్రతి మ్యాచ్లోనూ 11 సీట్లను కేటాయించాలని RCB నిర్ణయించింది.
తన గుర్తింపు దుర్వినియోగానికి సంబంధించిన కేసులో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. గంభీర్ పేరు, ఫొటో, వాయిస్, ఏఐ జనరేటెడ్తో కూడిన వీడియోలను 36 గంటల్లో తొలగించాలని ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్లో గంభీర్ గుర్తింపును దుర్వినియోగం చేసినట్లు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో బంగ్లా క్రికెటర్లను IPLలో ఆడేందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఆ దేశంలో IPL మ్యాచుల బ్రాడ్కాస్టింగ్ను బహిష్కరించాలని డిమాండ్లు వచ్చాయి. అయితే, తమ దేశంలో IPL ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతిస్తున్నట్లు బంగ్లా ప్రసారశాఖ మంత్రి వెల్లడించారు.
IDCA బదిర అమ్మాయిల క్రికెట్ టోర్నీ ‘టీ10 నేషనల్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2026’ విజేతగా ఆంధ్రా జట్టు నిలిచింది. ఢిల్లీతో జరిగిన ఫైనల్లో 5 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత ఆంధ్రా జట్టు 73/4 స్కోర్ చేయగా.. లక్ష్యచేధనలో ఢిల్లీ 68/4కే పరిమితమైంది.
IPL 19వ సీజన్ ప్రారంభానికి ముందే ధోనీ, CSK అభిమానులకు షాక్ తగిలింది. కాలి కండరాల్లో గాయంతో ధోనీ IPL తొలి రెండు వారాలకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని CSK ధ్రువీకరించింది. ధోనీని ఎప్పుడెప్పుడు మైదానంలో చూద్దామా అని ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా ఎదురుదెబ్బే. ఈ క్రమంలో తమ అభిమాన క్రికెటర్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ను ఫ్లోరిడా పోలీసులు DUI కింద అరెస్ట్ అయ్యాడు. వుడ్స్ ల్యాండ్ రోవర్ కారులో ప్రయాణిస్తూ.. మరో ట్రక్కును ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. వుడ్స్ మద్యం తాగలేదని తేల్చారు. కానీ డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు తీసుకున్నారనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు.
➤ అత్యధిక పరుగులు: 8661* (విరాట్ కోహ్లీ)➤ అత్యధిక వికెట్లు: 221* (యుజ్వేంద్ర చాహల్)➤ అత్యధిక వ్యక్తిగత స్కోర్: 175 (క్రిస్ గేల్)➤ అత్యధిక జట్టు స్కోర్: 287/3 (SRH)➤ అతి పెద్ద ఛేదన: 262 (PBKS)