• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

ఆస్ట్రేలియాతో సిరీస్ గెలుస్తాం: రవీంద్ర జడేజా

ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సిరీస్‌లు సాధిస్తామని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ధీమా వ్యక్తం చేశాడు. ‘మేం మంచి స్థితిలో ఉన్నాం. 3 మ్యాచ్‌ల తర్వాత 1-1తో సిరీస్ ఆసక్తికరంగా మారింది. రాబోయే రెండు మ్యాచుల్లో మేం ఒకటి గెలిచిన సిరీస్‌ను కాపాడుకుంటాం. ఎందుకంటే గత రెండుసార్లు ఇక్కడ మేం సిరీస్ గెలుచుకున్నాం’ అని పేర్కొన్నాడు. ఇప్పుడు తమ ఫోకస్ అంతా బాక్సింగ్‌డే టెస్టుపైన...

December 21, 2024 / 04:00 PM IST

విరాట్ కోహ్లీ పబ్‌‌కు నోటీసులు

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బెంగళూరు బృహత్ మహానగర పాలికే సంస్థ అధికారులు షాక్ ఇచ్చారు. కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్‌కు BBMP అధికారులు నోటీసులు జారీ చేశారు. చిన్నస్వామి స్టేడియం సమీపంలోని రత్నం కాంప్లెక్స్ 6వ ఫ్లోర్‌లో కోహ్లీ పబ్ ఉండగా.. నవంబర్ 29న సామాజిక కార్యకర్త హెచ్ఎం వెంకటేష్ ఫిర్యాదు చేశాడు.

December 21, 2024 / 03:25 PM IST

ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొడతాం: రవీంద్ర జడేజా

బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ కోసం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ సాధించి ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొడతామని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 26 నుంచి మెల్‌బోర్న్‌లో జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు ముందు జడేజా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. గత రెండు పర్యటనల్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

December 21, 2024 / 02:38 PM IST

మాజీ క్రికెటర్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ

మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఉతప్ప దుస్తుల కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన భవిష్యనిధిలో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. డిసెంబర్ 27లోపు రూ.24 లక్షల బకాయిలు చెల్లించాలని, లేకపోతే అరెస్టు తప్పదని హెచ్చరించారు. బెంగళూరులోని సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్‌గా ఉతప్ప వ్యవహరిస్తున్నాడు.

December 21, 2024 / 12:46 PM IST

అశ్విన్‌తో విభేదాలున్నట్లు వార్తలు.. హర్భజన్ క్లారిటీ

అంతర్జాతీయ క్రికెట్ కు రవిచంద్రన్ అశ్విన్‌ ఇటీవల రిటైర్మెంట్‍ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అశ్విన్‌, హర్భజన్‌ సింగ్ మధ్య విభేదాలున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాంటి వార్తలపై తాజాగా హర్భజన్ స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి పుకార్లు సృస్తిస్తున్నారని ఆరోపించారు. అశ్విన్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

December 21, 2024 / 12:07 PM IST

‘రోజంతా కలిసే ఉన్నా.. హింట్ ఇవ్వలేదు’

రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‍పై క్రికెటర్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిటైర్మెంట్‍ ప్రకటించే రోజంతా అశ్విన్ తో కలిసే ఉన్నానని..  అయినాతనకు ఒక్క హింట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. ‘చివరి నిమిషాల్లో రిటైర్మెంట్ గురించి నాకు తెలిసింది. మీడియా సమావేశానికి ఐదు నిమిషాల ముందే తెలిసింది. నాకు ఇది షాకింగ్‍గా అనిపించింది’ అని అన్నాడు.

December 21, 2024 / 12:00 PM IST

ఉమ్మడి జిల్లా స్థాయి సెలెక్షన్స్

NLG: ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి ఖోఖో జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 22న దామరచర్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డు ఒరిజినల్, జిరాక్స్ కాపీలతో ఉదయం 9 గంటలకు పాఠశాలలో ఖోఖో కోచ్ నాగేశ్వరరావుకు అందజేయాలన్నారు.

December 21, 2024 / 11:58 AM IST

అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు?

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో టెస్టుల్లో అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు అనే విషయం ఆసక్తి రేపుతోంది. ఈ జాబితాలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీళ్లు నిలకడగా ఆడకపోవడం మైనస్. ఒక సిరీస్ ఆడితే మరో సిరీస్‌లో విఫలమవుతున్నారు. దీంతో జట్టులోకి వచ్చి వెంటనే స్థానం కోల్పోతున...

December 21, 2024 / 09:54 AM IST

రేపటి నుంచి జిల్లా క్రాస్ కంట్రీ ఛాంపియన్ షిప్ పోటీలు

ప్రకాశం: చినగంజాంలోని ఖాజీపాలెం కేవీఆర్ అండ్ ఎంకేఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ నెల 22 నుంచి జిల్లా క్రాస్ కంట్రీ ఛాంపియన్  షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి మారుబోయిన వెంకటరెడ్డి తెలిపారు. పురుషుల, మహిళల 10 కిలోమీటర్లు పరుగుపందెం, అండర్-20 విభాగంలో బాలురకు, బాలికలకు 6 కిలోమీటర్లు పరుగు పందెం నిర్వహిస్తామని చెప్పారు.

December 21, 2024 / 07:34 AM IST

షమీకి మళ్లీ గాయం

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మరోసారి గాయపడ్డాడు. దీంతో హైదరాబాద్ వేదికగా ఢిల్లీతో జరిగే విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని బెంగాల్ బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ ప్రకటించింది. కాగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో షమీ అడే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి.

December 21, 2024 / 06:55 AM IST

ఇక భారత్ ఎప్పటికీ పాక్‌తో క్రికెట్ ఆడదు: షెహజాద్

భారత్ ఇక ఎప్పటికీ పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడదని పాక్ మాజీ ఆటగాడు అహ్మద్ షెహజాద్ అన్నాడు. భారత్‌కు ఆతిథ్యం ఇచ్చే గోల్డెన్ ఛాన్స్ పాక్ మిస్ చేసుకుందన్నారు. పాక్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటామని అన్ని దేశాలు సంతకాలు చేశాయి. ఈ విషయంలో ఐసీసీ వెనక్కి తగ్గలేదు. పీసీబీయే అవకాశాన్ని వదులుకుందని పేర్కొన్నాడు.

December 21, 2024 / 06:34 AM IST

రేపు జిల్లాలో అండర్ 17 ఖోఖో జట్ల ఎంపికలు

KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్ 17 ఖోఖో జట్ల ఎంపికలు ఈనెల 22వ(ఆదివారం) తేదీన ఖమ్మం స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఎసీఎఫ్ కార్యదర్శి నర్సింహమూర్తి తెలిపారు. 2008 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన ఇంటర్ చదివే వారు కూడా ఈ ఎంపికల్లో పాల్గొనవచ్చని, ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 9 గంటలకు స్టేడియానికి రావాలని కార్యదర్శి కోరారు. ఆధార్ కార్డు తప్పనిసరి అని సూచించారు.

December 21, 2024 / 06:07 AM IST

రాష్ట్రస్థాయి పోటీలకు కొలనూర్ విద్యార్థినులు ఎంపిక

PDPL: సుల్తానాబాద్‌లో జరిగిన జిల్లాస్థాయి సీఎం కప్ పోటీల్లో ఓదెల మండలంలోని కొలనూర్‌కు చెందిన విద్యార్థినులు సత్తాచాటారు. జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న రెండ్ల శ్రావ్యశ్రీ షాట్‌ఫుట్ విభాగంలో జిల్లాస్థాయిలో ఫస్ట్ ప్లేస్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. కొలిపాక అశ్విత డిస్కస్ త్రోలో సెకండ్ ప్లేస్‌లో నిలిచి స్టేట్ లెవల్ పోటీలకు ఎంపికైంది.

December 21, 2024 / 05:06 AM IST

ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

NZB: జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ మైదానంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ నేటితో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీపీ బసవరెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు, ప్రైజ్ మనీ అందజేశారు. క్రికెట్ విన్నర్‌గా ఆరెంజ్ ఆర్మీ, రన్నరప్‌గా నిజామాబాద్ స్టార్స్ నిలిచాయి.

December 21, 2024 / 05:00 AM IST

నేడు జర్నలిస్ట్‌లకు, ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు

ADB: జిల్లా కేంద్రం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నేడు(శనివారం)సీఎం కప్ పోటీల్లో భాగంగా ప్రభుత్వశాఖ ఉద్యోగులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా వారికి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు DYSO వెంకటేశ్వర్లు ప్రకటనలో తెలిపారు. వాలీబాల్, బ్యాడ్మింటన్, రన్నింగ్, టగ్-ఆఫ్-వార్, చెస్, క్యారం పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు పాల్గొనాలని కోరారు.

December 21, 2024 / 04:32 AM IST