KNR: క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ బొమ్మకల్లో ఎల్పిఎల్ లీగ్ పోటీల ముగింపు సమావేశంలో అయన పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ట్రోపీలను, నగదును ఆయన అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు.
KNR: చొప్పదండి మండలం రాగంపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో, 7వ తరగతి చదువుతున్న ఉడుత రిత్విక అనే విద్యార్థిని, సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఈ నెల 29 వరకు సరూర్ నగర్లో జరిగే ఆట్య పాట్య ఛాంపియన్ షిప్లో ఆమె పాల్గొంటున్నారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు.
KNR: సీఎం కప్ పోటీలలో భాగంగా కరీంనగర్లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జూడో రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ప్రారంభించే ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పిస్తూ సంతాపం ప్రకటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పోటీలను ఒలంపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి జనార్దన్ రెడ్డి, జిల్లా క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్ ప్రారంభించారు.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ(140) బాదడంతో భారత్పై ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ ఇప్పటి వరకు భారత్పై 43 ఇన్నింగ్స్లు ఆడి 11 టెస్టు సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 10 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ(140) బాదడంతో భారత్పై ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ ఇప్పటి వరకు భారత్పై 43 ఇన్నింగ్స్లు ఆడి 11 టెస్టు సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 10 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ(140) బాదడంతో భారత్పై ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ ఇప్పటి వరకు భారత్పై 43 ఇన్నింగ్స్లు ఆడి 11 టెస్టు సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 10 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త ఫామ్ కొనసాగుతోంది. గత రెండు టెస్టుల్లో మిడిలార్డర్లో బరిలోకి దిగి విఫలమవడంతో బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్గా దిగాడు. అయితే కమిన్స్ వేసిన తొలి ఓవర్లోనే చెత్త షాట్ ఆడి ఔట్ అయ్యాడు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్ కీలకంగా మారగా.. రోహిత్ ఫెయిల్ కావడంపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మెల్బోర్న్ వేదికగా భారత్తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాటర్లు కోన్స్టాస్ (60), ఖవాజా (57), లబుషేన్ (72) హాఫ్ సెంచరీలతో రాణించగా.. స్టీవెన్ స్మిత్ అద్భుత సెంచరీతో(140) మెరవడంతో 474 పరుగుల భారీ స్కోరుకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా 4, జడేజా 3, ఆకాశ్ 2 వికెట్లు, సుందర్ 1 వికెట్ పడగొట్టారు.
భారత్తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది. 311/6 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మొదటి నుంచి దూకుడుగా ఆడుతుంది. ఈ క్రమంలో స్మిత్ సూపర్ సెంచరీతో(139*) టెస్టుల్లో తన 34వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. క్రీజులో స్మిత్, స్టార్క్ ఉన్నారు. లంచ్ సమయానికి ఆసీస్ స్కోర్ 454/7.
ఆసీస్, భారత్ మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో తొలి రోజు ఆటలో ఆసీస్ బ్యాటర్లు లబుషేన్, కాన్స్టాస్ పిచ్పై నడిచారు. దీంతో ఆసీస్ ఆటగాళ్లపై భారత మాజీలు సునీల్ గావస్కర్, ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డారు. పిచ్పై నడవొద్దని రోహిత్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అంపైర్లు చేయాల్సిన పని రోహిత్ చేశాడని గావస్కర్, ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించారు.
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(MCG)లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్లో బుమ్రా సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తొలి రోజు ఆటలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో MCGలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు. MCGలో బుమ్రా మూడు మ్యాచ్లు ఆడి మొత్తం 18 వికెట్లు తీసుకున్నాడు. అంతకు ముందు అనిల్ కుంబ్లే(15) పేరిట ఈ రికార్డ్ ఉండేది.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఊరట లభించింది. బాక్సింగ్ డే మ్యాచ్ నిషేధం నుంచి విరాట్ తప్పించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో యువ ఆటగాడు కాన్ స్టాస్తో వివాదం నెలకొన్న వేళ కోహ్లీని ఒక మ్యాచ్ నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగింది. కాగా ఐసీసీ అతడి మ్యాచ్ ఫీజు నుంచి 20 శాతం కోత విధించింది.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా యువ ఆటగాడు కాన్స్టాస్తో కోహ్లీ వివాదంపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఓవర్ పూర్తయ్యాక పిచ్పై అవతలి ఎండ్ వైపు నడిచి వెళ్తున్న కాన్స్టాస్ను కోహ్లీ ఢీ కొట్టాడు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది. జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా కోహ్లీ ఖాతాలో చేరింది.
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్ (68), కమిన్స్ (8) ఉన్నారు. కొన్స్టాస్ (60), ఖవాజా (57), లబుషేన్ (72) రాణించారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.
బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. అతడు కావాలనే ఆస్ట్రేలియా అరంగేట్ర ఆటగాడు కొన్స్టాస్ను ఢీకొట్టాడని పలువురు తప్పుబడుతున్నారు. దీనిపై ICC చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కోహ్లీ తప్పు చేశాడని ఐసీసీ నిర్ధారిస్తే 3-4 డీ మెరిట్ పాయింట్లు ఇవ్వడంతో పాటు ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించే అవకాశం ఉంది.