T20 WC నిర్వాహకులపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మరోసారి మండిపడ్డాడు. ఓవర్ మధ్యలో DJ ప్లే చేయడం వల్ల ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతింటుందని అభిప్రాయపడ్డాడు. గతంలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లోనూ అనవసరంగా లేజర్ షో ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశాడు. కాగా, ఇంగ్లండ్తో మ్యాచ్లో బుమ్రా బౌలింగ్ వేస్తుండగా, ఓవర్ మధ్యలోనే డీజే ప్లే చేయడంపై అసహనం వ్యక్తం చేశాడు.
T20 WC ఫైనల్ మ్యాచ్ ఒకవేళ వర్షం కారణంగా నిలిచిపోతే, రిజర్వ్ డే ఉంటుంది. ఒకవేళ ఆ రోజు కూడా ఆట సాధ్యం కాకపోతే, రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అయితే, ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 10 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. కాగా, అహ్మదాబాద్ వేదికగా ఈనెల 8న భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే తుది పోరులో వర్షం పడే అవకాశమే లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) కొత్త కమిటీపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో సీఐడీ అధికారులు ప్రాథమిక విచారణను ప్రారంభించారు. HCA కొత్త కమిటీపై నిధుల దుర్వినియోగంతో పాటు పలు అక్రమాలకు కూడా పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. CID విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
T20 WC ఫైనల్ అహ్మదాబాద్లోని మోదీ స్టేడియం వేదికగా జరగనుండటం భారత అభిమానులను కలవరపెడుతోంది. ఎందుకంటే, ఇదే స్టేడియంలో భారత్ 2023 ODI WC ఫైనల్లో ఓడింది. అలాగే, ప్రస్తుత T20 WC S-8 దశలో కూడా సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. గత 30 ICC మ్యాచ్ల్లో భారత్ ఓడిన 2 మ్యాచ్లు కూడా ఇదే స్టేడియంలో కావడం గమనార్హం. మొత్తంగా ఈ స్టేడియంలో 10 మ్యాచ్లు ఆడితే.. 7W, 3L.
భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులకు ఆలౌటైంది. జెమిమా రోడ్రిగ్స్ (52) హాఫ్ సెంచరీతో రాణించగా, షఫాలీ వర్మ (35), కాశ్వీ గౌతమ్ (34) పర్వాలేదనిపించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 96/3 పరుగులు చేసింది. పెర్రీ(43), సదర్లాండ్(20) క్రీజులో ఉన్నారు.
సెమీఫైనల్లో తాము ఓడిపోవడానికి అక్షర్ పటేల్ అందుకున్న రెండు అద్భుతమైన క్యాచ్లే కారణమని ఇంగ్లండ్ కోచ్ మెకల్లమ్ అభిప్రాయపడ్డాడు. అక్షర్ పట్టుకున్న బ్రూక్, జాక్స్ క్యాచ్లే మ్యాచ్ను తమ నుంచి దూరం చేశాయని వ్యాఖ్యానించాడు. ఒత్తిడి సమయాల్లో అక్షర్ అసాధారణమైన ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. తాము ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉండాల్సిందని పేర్కొన్నాడు.
భారత్తో సెమీస్లో ఇంగ్లండ్ యువ ఆటగాడు జేకబ్ బెథల్ (22 ఏళ్లు) తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఒంటరి పోరాటం చేస్తూ దాదాపు ఇంగ్లండ్ను గెలిపించినంత పని చేశాడు. ఇంగ్లండ్ ఓడిపోయినప్పటికీ, బెథల్ పోరాటం అభిమానుల మనసులను గెలుచుకుంది. అయితే, 2022లో IND-ENG సెమీస్ను బెథల్ స్టేడియంలో కూర్చుని ప్రేక్షకుడిలా చూశాడు. కేవలం నాలుగేళ్లలోనే స్టార్గా ఎదగడం విశేషం.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 198 పరుగులకే ఆలౌటైంది. జెమిమా రోడ్రిగ్స్ (52) హాఫ్ సెంచరీతో రాణించగా, షఫాలీ వర్మ (35), కాశ్వీ గౌతమ్ (34) పర్వాలేదనిపించారు. అయితే స్టార్ ప్లేయర్లు స్మృతి (4), హర్మన్ప్రీత్ (19), దీప్తి (7) ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 4, హామిల్టన్ 3, డార్సీ బ్రౌన్ 2 వికెట్లు పడగొట్టారు.
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో బ్రూక్ వికెట్ తీయడం ద్వారా బుమ్రా ఈ ఘనత సాధించాడు. ఈ మైలురాయిని చేరుకున్న 8వ భారత బౌలర్గా నిలిచాడు. టెస్టుల్లో 234, వన్డేల్లో 149, టీ20Iల్లో 117 వికెట్లు పడగొట్టాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మొత్తం 34 సిక్సర్లు నమోదయ్యాయి. భారత బ్యాటర్లు 19 సిక్సర్లు బాదగా, ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 15 సిక్సర్లు వచ్చాయి. దీంతో టీ20 వరల్డ్ కప్లో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్గా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్లో నమోదైన 31 సిక్సర్ల రికార్డును ఈ మ్యాచ్ అధిగమించింది.
భారత్ చేతిలో ఎదురైన ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన తప్పిదం వల్లే ఈ మ్యాచ్లో ఓడిపోయామని బ్రూక్ భావోద్వేగానికి గురయ్యాడు. సంజూ శాంసన్ ఇచ్చిన సులువైన క్యాచ్ను తను జారవిడిచి ఉండాల్సింది కాదన్నాడు. అదే తాను చేసిన అతిపెద్ద తప్పని వ్యాఖ్యానించాడు. బ్రూక్ క్యాచ్ మిస్ చేయడంతో సంజూ 89 పరుగులతో మ్యాచ్ను భారత్ వైపు తిప్పేశాడు.
T20 WCలో అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్ల్లో అతను కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని జట్టు నుంచి తొలగించాలనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ కోచ్ రవిశాస్త్రి అభిషేక్కు మద్దతుగా నిలిచాడు. ఫైనల్లో అతడిని ఆడించాలని, తుది జట్టులో మార్పులు అవసరం లేదని సూచించాడు. ఫైనల్లో అభిషేక్ రాణించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో పరుగుల వరద పారింది. రెండు జట్లు కలిసి ఏకంగా 499 పరుగులు సాధించాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్లో నమోదైన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. గతంలో ఈ రికార్డు 2016 WCలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ (459 పరుగులు) పేరిట ఉండేది. అయితే, ఈ మ్యాచ్ కూడా వాంఖడే స్టేడియంలోనే జరగటం గమనార్హం.
T20 WC 2026 టైటిల్ కోసం ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ తుది పోరుకు అహ్మదాబాద్ వేదిక కావడం క్రికెట్ అభిమానులను కలవర పెడుతోంది. వన్డే వరల్డ్ కప్ 2023లో అజేయంగా రాణించిన రోహిత్ సేన ఫైనల్లో ఇక్కడే ఆసీస్ చేతిలో ఓడింది. ICC టోర్నీల్లో వరుసగా 13 మ్యాచుల్లో గెలిచిన భారత్ విజయ పరంపరకు కూడా ఇక్కడే సౌతాఫ్రికా బ్రేక్ వేసింది.
T20 WC 2026 టైటిల్ కోసం ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ తుది పోరుకు అహ్మదాబాద్ వేదిక కావడం క్రికెట్ అభిమానులను కలవర పెడుతోంది. వన్డే వరల్డ్ కప్ 2023లో అజేయంగా రాణించిన రోహిత్ సేన ఇక్కడే ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్ ఓడింది. ICC టోర్నీల్లో వరుసగా 13 మ్యాచుల్లో గెలిచిన భారత్ విజయ పరంపరకు కూడా ఇక్కడే సౌతాఫ్రికా బ్రేక్ వేసింది.