ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024 అవార్డుకు భారత క్రికెటర్ శ్రేయాంకా పాటిల్ నామినేట్ చేయబడింది. ఆమెతో పాటు సస్కియా హార్లీ(స్కాట్లాండ్), అన్నరీ డెర్క్సెన్(దక్షిణాఫ్రికా), ఫ్రెయా సార్జెంట్(ఐర్లాండ్) నామినేట్ అయ్యారు. మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్లో పాల్గొన్న తొలి భారతీయ క్రీడాకారిణిగా శ్రేయాంక డిసెంబర్ 2023లో చరిత్ర సృష్టించింది.
ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024 అవార్డుకు భారత క్రికెటర్ శ్రేయాంకా పాటిల్ నామినేట్ చేయబడింది. ఆమెతో పాటు సస్కియా హార్లీ(స్కాట్లాండ్), అన్నరీ డెర్క్సెన్(దక్షిణాఫ్రికా), ఫ్రెయా సార్జెంట్(ఐర్లాండ్) నామినేట్ అయ్యారు. మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్లో పాల్గొన్న తొలి భారతీయ క్రీడాకారిణిగా శ్రేయాంక డిసెంబర్ 2023లో చరిత్ర సృష్టించింది.
PDPL: రాష్ట్రస్థాయి సీఎం కప్ ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు వరంగల్లో రిపోర్ట్ చేయాలని పెద్దపల్లి జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి సురేశ్ తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు పోటీలు జరుగుతాయన్నారు. పెద్దపల్లి జిల్లా తరఫున క్రీడాకారులకు టీషర్ట్స్, బస్సు పాసులు ఇస్తామన్నారు. వివరాలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
SRCL: సీఎం కప్ రాష్ట్రస్థాయి ఖోఖో జట్టుకు తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల మోడల్ స్కూల్ విద్యార్థిని జి. శరణ్య ఎంపికయింది. శనివారం శరణ్యను మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాధ, పీఈటీ స్వాతి, ఇతర అధ్యాపక బృందం అభినందించింది. ఇటీవల జరిగిన సీఎం కప్ జిల్లాస్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి ఖోఖో జట్టుకు శరణ్య ఎంపికైంది.
KNR: శంకరపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు అనిల్, ప్రవీణ్, అర్చన, సాయితేజలు జిల్లాస్థాయిలో సాఫ్ట్ బాల్ పోటీల్లో విజేతలుగా నిలిచారు. ఈనెల 27-29 తేదీలలో మెదక్ జిల్లాలో రాష్ట్రస్థాయి సీఎం పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సరిత తెలిపారు. సరిత మాట్లాడుతూ.. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో గెలుపొంది మోడల్ స్కూల్ ప్రతిభను చాటాలన్నారు.
ఖమ్మం: సీఎం కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ముగియనున్నట్లు డీవైఎస్ఓ సునీల్ రెడ్డి తెలిపారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో మూడు రోజులుగా ఆడిన జట్లు టైటిల్ బరిలో నిలిచాయి. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా పోటీలు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్ ఫలితం కోసం భారత్, ఆసీస్, శ్రీలంక ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే ఇందులో సౌతాఫ్రికా గెలిస్తే WTC ఫైనల్కు దూసుకెళ్తుంది. రెండో ఇన్నింగ్స్లో 237 పరుగులకే ఆలౌట్ అయిన పాక్.. సౌతాఫ్రికాకు 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోర్ 27/3.
మెల్బోర్న్ టెస్టులో సెంచరీ చేసిన నితీశ్ రెడ్డిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. అతనికి మొదటి టెస్టు సెంచరీ, భవిష్యత్లో మరిన్ని పరుగులు సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. తల్లిదండ్రుల త్యాగాల వల్ల ఈ స్థాయికి చేరుకున్నాననే విషయాన్ని మర్చిపోవద్దని సూచించాడు. భవిష్యత్లోనూ ఇదే విధంగా ఆడితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
AP: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివనాథ్ తెలుగు యువ క్రికెటర్ నితీశ్కు రూ.25 లక్షల ప్రోత్సాహం ప్రకటించారు. త్వరలోనే CM చంద్రబాబు చేతుల మీదుగా నగదు అందిస్తామని పేర్కొన్నారు. దేశంలోనే అత్యాధునిక వసతులతో అమరావతిలో స్టేడియాన్ని నిర్మిస్తామని చెప్పారు. IPL మ్యాచ్లు ఆడేలా విశాఖ స్టేడియం సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
BGT ట్రోఫీకి అనుభవం లేని నితీష్ ఎంపికపై చర్చలు జరిగాయి. ఎంపికైనా కూడా తుది జట్టులో ఉండకపోవచ్చనని అనుకున్నారంతా. కానీ మొదటి టెస్టులోనే ఛాన్స్ రావడంతో అందివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని ఈ సిరీస్లో 38, 41, 42, 42, 16 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. ఇవాళ్టి ఇన్నింగ్స్తో జట్టులో చోటు కష్టమనుకున్నా, అతడు రియల్ ‘గేమ్ ఛేంజర్’లా మారాడని పోస్టులు పెడుతున్నారు.
బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. 164/5 వద్ద రోజు ఆట ప్రారంభించిన టీమిండియా కాసేపటికే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో క్రీజులో వచ్చిన సుందర్, నితీష్ కుమార్ రాణించడంతో భారత్ 359/9 స్కోర్ చేసింది. ప్రస్తుతం క్రీజులో నితీష్(105*), సిరాజ్(2*) ఉన్నారు. భారత్ ఇంకా 116 పరుగులు వెనకబడి ఉంది.
తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆసీస్ గడ్డపై చెలరేగుతున్నాడు. తనకు ఇది మొదటి సిరీస్ అయినా ఏ మాత్రం భయం లేకుండా ఆ జట్టు స్టార్ పేసర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో నితీష్ తన తొలి టెస్టు సెంచరీ సాధించాడు. నితీష్ సెంచరీ చేయగానే.. మైదానంలో తన తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 354/9.
బాక్సింగ్ డే టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి సూపర్ ఫిఫ్టీ(54*) సాధించాడు. 6 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన నితీష్.. 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. నితీష్ గత మ్యాచుల్లో 40 ప్లస్ పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఎట్టకేలకు ఇవాళ టెస్టుల్లో తన మొదటి హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 274/7.
భారత్ మరో వికెట్ను కోల్పోయింది. నాథన్ లైయన్ బౌలింగ్లో LBగా జడేజా (17) పెవిలియన్కు చేరాడు. DRS తీసుకున్నా భారత్కు సానుకూల ఫలితం రాలేదు. సమీక్షలో ‘అంపైర్స్ కాల్’ నిర్ణయం రావడంతో నిరాశగా జడేజా డగౌట్కు వెళ్లాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 222/7. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 53 పరుగులు అవసరం.
కోనసీమ: అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో బీచ్ వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శుక్రవారం జరిగిన వాలీబాల్ మ్యాచ్లో మొదటి ఆటగా గోవా, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడ్డాయి. హోరా హోరీగా జరిగిన ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు విజయం సాధించింది. విద్యుత్ ద్వీపాల వెలుగులలో పోటీలు జరుగుతున్నాయి.