339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న భారత్ జట్టు, ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇస్తోంది. 21 ఓవర్లు ముగిసేసరికి భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 124 పరుగులు చేసింది. భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 25 పరుగులతో ఉంది. అయితే, విజయానికి భారత్కు ఇంకా 216 పరుగులు కావాలి.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. 59 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. షఫాలీ వర్మ (10) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరగా.. 9.2 ఓవర్లో స్మృతి మంధాన (24) ఔటైంది. దీంతో భారత్ 11 ఓవర్లకు 66 పరుగులు చేసింది. ప్రస్తుతం హర్మన్ప్రీత్ కౌర్ (2*), జెమీమా రోడ్రిగ్స్ (24*) క్రీజ్లో ఉన్నారు.
WWCలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. 59 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. షఫాలీ వర్మ (10) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరగా.. 9.2 ఓవర్లో స్మృతి మంధాన (24) ఔటైంది. దీంతో భారత్ 11 ఓవర్లకు 66 పరుగులు చేసింది. ప్రస్తుతం హర్మన్ప్రీత్ కౌర్ (2*), జెమీమా రోడ్రిగ్స్ (24*) క్రీజ్లో ఉన్నారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్లో స్మృతి మంధాన అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ మ్యాచ్లో 4 పరుగులు చేయడం ద్వారా ఆస్ట్రేలియాపై వన్డేల్లో 1000 పరుగులు చేసిన ఘనత సాధించింది. ఆసీస్పై మంధాన 21 ఇన్నింగ్స్లలో 6 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీల సహాయంతో ఈ మైలురాయిని చేరుకుంది. గతంలో ఇంగ్లండ్పై కూడా ఆమె 1000 పరుగుల మార్క్ను అందుకుంది.
మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ముందు ఆస్ట్రేలియా 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. WC చరిత్రలో నాకౌట్ మ్యాచ్లలో ఇంత భారీ లక్ష్యాన్ని ఇప్పటివరకు ఏ జట్టు ఛేదించలేదు. ఈ నేపథ్యంలో, టీమిండియా ఈ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టిస్తుందా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే భారత జట్టు ఆశలన్నీ స్మృతి మంధానపైనే ఆధారపడి ఉన్నాయి.
మహిళల వన్డే WC సెమీఫైనల్లో టీమిండియాపై ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ ఓపెనర్ లిచ్ఫీల్డ్(119) సెంచరీతో అదరగొట్టగా, పెర్రీ(77), గార్డనర్(63) రాణించారు. దీంతో 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో శ్రీచరణి, దీప్తి తలో రెండు వికెట్లు పడగొట్టారు. అయితే, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
టీమిండియాతో జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ అద్భుతమైన సెంచరీ సాధించింది. ఆమె కేవలం 78 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్సర్తో శతకాన్ని పూర్తి చేసుకుంది. ఇది ఆమెకు ప్రపంచకప్లో తొలి సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం 24 ఓవర్లలో ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది.
టీమిండియాతో జరుగుతున్న సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఫోబ్ లిచ్ఫీల్డ్ (83*), ఎల్లీస్ పెర్రీ (37*) వేగంగా ఆడుతూ 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 135 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఈ జోడీని త్వరగా విడదీయకపోతే, ఆసీస్ భారీ స్కోరు చేసే అవకాశం ఉంది.
టీమిండియాతో జరుగుతున్న సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఫోబ్ లిచ్ఫీల్డ్ (83*), ఎల్లీస్ పెర్రీ (37*) వేగంగా ఆడుతూ 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 135 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఈ జోడీని త్వరగా విడదీయకపోతే, ఆసీస్ భారీ స్కోరు చేసే అవకాశం ఉంది.
కోల్కతా నైట్రైడర్స్ హెడ్ కోచ్గా అభిషేక్ నాయర్ ఎంపికయ్యాడు. ఈ మేరకు KKR ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. 2025 IPLలో ఘోర ప్రదర్శన అనంతరం హెడ్ కోచ్గా ఉన్న చంద్రకాంత్ పండిత్ను KKR తప్పించింది. అతడి స్థానంలో అభిషేక్కు అవకాశం కల్పించింది. కాగా, గతంలో అభిషేక్.. టీమిండియాకు అసిస్టెంట్ కోచ్గా, KKRకు బ్యాటింగ్ కోచ్గా పనిచేశాడు.
భారత్-ఆస్ట్రేలియా మహిళల సెమీఫైనల్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. భారత్ బౌలర్ క్రాంతి గౌడ్ ఆస్ట్రేలియా కెప్టెన్ అలిసా హీలీని క్లీన్ బౌల్డ్ చేసిన వెంటనే వర్షం ప్రారంభం కావడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. ప్రస్తుతం ఆట నిలిచిపోయే సమయానికి ఆస్ట్రేలియా 5.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది.
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా నవీ ముంబై వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ అలిసా హీలీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
‘క్రికెట్లో ఏదైనా సాధ్యమే’ అని భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ను ఉద్దేశించి విండీస్ దిగ్గజం ఇయాన్ బిషప్ అన్నాడు. ఆసీస్ అజేయ టీమ్ ఏమీ కాదని చెప్పాడు. భారత్ కూడా సెమీస్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అయితే ఛాంపియన్ జట్టును ఓడించడానికి భారత్ తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు.
ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర విషాదం నెలకొంది. బంతి మెడకు తగలడంతో యువ ప్లేయర్ బెన్ ఆస్టిన్(17) ప్రాణాలు కోల్పోయాడు. ఆస్టిన్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన జరగ్గా.. అతడి మృతి పట్ల ఆసీస్ క్రికెట్ బోర్డ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. మంచి భవిష్యత్ గల యువ ఆటగాడిని కోల్పోయామని పేర్కొంది. కాగా 11 ఏళ్ల క్రితం AUS బ్యాటర్ ఫిలిప్ హ్యూస్ కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయాడు.