WPL-3లో భాగంగా యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత యూపీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కిరణ్ నవ్గిరే (51) అర్ధ శతకం చేసింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మెగ్ లానింగ్ (69), అన్నాబెల్ సదర్లాండ్ (41) రాణించారు.
కరాచీ వేదికగా జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లో కివిస్ ఓపెనర్ విల్యంగా సత్తా చాటాడు. 107 బంతుల్లో సెంచరీ చేశాడు. అందులో ఒక సిక్స్, 11 ఫోర్లు ఉన్నాయి. వన్డే కెరీర్లో అతడికిది నాలుగో సెంచరీ. క్రీజులో ఉన్న మరో కివిస్ ఆటగాడు లేథమ్ కూడా అర్థ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం కివిస్ స్కోర్ 34.3 ఓవర్లలో 173/3
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచులో న్యూజిలాండ్తో పాకిస్థాన్ తలపడుతోంది. దీంట్లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, ఈ రెండు టీంలు టీమిండియా తలపడే గ్రూపులోనే ఉన్నాయి.
NZB: కాకినాడలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్లో తెలంగాణ సెక్రటేరియట్ హాకీ టీం విజయం సాధించిందని కెప్టెన్ డాక్టర్ స్వామి కుమార్ తెలిపారు. హోరాహోరి పోరులో మధ్యప్రదేశ్ జట్టుపై నాలుగు మూడు స్కోర్తో ఘనవిజయం సాధించింది. 3-3తో డ్రాగ ముగుస్తున్న సమయంలో చివరి నిమిషంలో జనార్ధన్ గోల్ కోటడంతో విజయం సాధించినట్లు తెలిపారు.
WPL-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా మొత్తం ఈ సీజన్ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని RCB యాజమన్యం ప్రకటించింది. దీంతో ఆమె స్థానంలో స్నేహ రాణా జట్టులోకి తీసుకుంది. స్నేహ గత ఏడాది గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడింది. అయితే ఈ సారి వేలంలో ఆమెను ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
NTR: ఇటీవల కాకినాడలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నా లాజికల్ యూనివర్సిటీ జరిగిన అంతర్ జిల్లాల తైక్వాండో పోటీలలో వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలోని ఏకత్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. 61 కేజీల విభాగంలో కే వర్ధన్ సాయి రజత పతకం, 30 కేజీల విభాగంలో పి. జయ రేణుక, ఎం. లక్ష్మి సహస్ర, వి. యశస్విని కాంశ్య పతకాలు సాధించారు.
RCB తమ నూతన సారథిగా టీమిండియా బ్యాటర్ రజత్ పటీదార్ను ఎంపిక చేసింది. అయితే పటీదార్ను కెప్టెన్గా ఎంపిక చేయడాన్ని విరాట్ కోహ్లీ సమర్థించాడు. దేశవాళీలో మధ్యప్రదేశ్ జట్టును అతను అద్భుతంగా నడిపించాడని, RCBని నడిపించే నైపుణ్యం పటీదార్కు ఉందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. కాగా గతంలో కోహ్లీ అనంతరం డుప్లెసిస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఒక్కరూ హాఫ్ సెంచరీ చేయలేదు. భారత బౌలర్లలో అర్ష్దీప్, హర్షిత్ రాణా, పాండ్యా, అక్షర్ రెండేసి వికెట్లు సాధించారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఈ విక్టరీ పెద్ద ఊరట అనే చెప్పాలి.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాల చేత ఈ మెగా టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ధృవీకరించాడు. ఇప్పటికే కమిన్స్, మార్ష్, హాజిల్వుడ్, స్టోయినిస్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.
AKP: పరవాడ మండలం వాడచీపురుపల్లి గ్రామంలో ఈనెల 17వ తేదీన జిల్లాస్థాయి కోలాటం పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామంలో జరిగే రామచంద్రమ్మ జాతర సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొనే కోలాట బృందాలు తమ పేర్లను ఈనెల 16వ తేదీ సాయంత్రంలోగా కమిటీ వద్ద నమోదు చేయించుకోవాలన్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డేలో కేవలం 77 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతడికి ఇది 32వ సెంచరీ. అలాగే, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో కోహ్లీ(51), సచిన్(49) ఉండగా.. రోహిత్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
కటక్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించింది. 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటర్లు బెన్ డకెట్(65), జో రూట్(69), బట్లర్ (34), బ్రూక్(31), లివింగ్స్టోన్(41) సమిష్టిగా రాణించారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీయగా.. షమీ, రాణా, పాండ్యా, చక్రవర్తి తలో వికెట్ తీసుకున్నారు. భారత్ టార్గెట్ 305.
SA T20 లీగ్లో ఎంఐ కేప్టౌన్ విజేతగా నిలిచింది. సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్తో జరిగిన ఫైనల్లో 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ 18.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఎంఐ తొలిసారి SA20 ఛాంపియన్స్గా అవతరించింది. మార్కో జాన్సెన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి రిషభ్ పంత్ను దృష్టిలో ఉంచుకోవాలని తొలుత సూచించినట్లు తెలిపాడు. అయితే, ఇప్పుడు అక్షర్ పటేల్ మంచి ఆప్షన్గా అనిపిస్తోందని పేర్కొన్నాడు. మిడిలార్డర్లో అక్షర్ సరిపోతాడని.. బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంటుందని అన్నాడు. రిషభ్ పంత్కు ఛాన్స్లు తక్కువేనని చెప్పుకొచ్చాడు.