భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో బ్రూక్ వికెట్ తీయడం ద్వారా బుమ్రా ఈ ఘనత సాధించాడు. ఈ మైలురాయిని చేరుకున్న 8వ భారత బౌలర్గా నిలిచాడు. టెస్టుల్లో 234, వన్డేల్లో 149, టీ20Iల్లో 117 వికెట్లు పడగొట్టాడు.