• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

T20 WC విజేత ఎవరో చెప్పేసిన ఏబీడీ, స్టెయిన్

టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య రేపు ప్రపంచకప్ ఫైనల్ ఫైట్ జరగనుంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు డివిలియర్స్, స్టెయిన్ ఫైనల్ విజేతగా నిలిచేది ఎవరో వెల్లడించారు. భారత్ ఛాంపియన్‌గా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. అయితే, కివీస్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. టీమిండియా ఏదైనా పెద్ద తప్పిదం చేస్తే తప్ప, NZ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు.

March 7, 2026 / 02:39 PM IST

వరుణ్ చక్రవర్తిని తొలగించాలి: మాజీ క్రికెటర్

రేపు న్యూజిలాండ్‌తో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టులో మార్పులు చేయాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తిని జట్టు నుంచి తొలగించి, అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలని చెప్పాడు. మరోవైపు, వరుసగా విఫలమవుతున్నప్పటికీ అభిషేక్ శర్మను ఫైనల్ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని ఆయన సూచించాడు.

March 7, 2026 / 02:30 PM IST

T20 WC ఫైనల్.. అభిమానులకు శుభవార్త

రేపు అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య T20 WC టైటిల్ పోరు జరగనున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు విమానయాన సంస్థలు శుభవార్త చెప్పాయి. దేశంలోని ప్రధాన నగరాల నుంచి అహ్మదాబాద్‌కు అదనపు ఫ్లైట్ సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్ ఇండియ ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్ ప్రకటించాయి. అటు భారతీయ రైల్వే కూడా పలు ప్రధాన నగరాల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

March 7, 2026 / 01:32 PM IST

రెండో క్రికెటర్‌గా ఎలీస్ పెర్రీ రికార్డ్

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎలీస్ పెర్రీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ 3 ఫార్మాట్లలోనూ 1000+ రన్స్ చేసిన 2వ ప్లేయర్‌గా నిలిచింది. భారత్‌తో టెస్టులో ఈ ఘనత సాధించిన ఆమె.. ఇప్పటివరకు T20ల్లో 2201, వన్డేల్లో 4504, టెస్టుల్లో 1006 రన్స్ చేసింది. పెర్రీ కంటే ముందు చార్లెట్ ఎడ్వర్డ్స్(ENG) T20ల్లో 1676, వన్డేల్లో 5992, టెస్టుల్లో 2605 రన్స్ చేసింది.

March 7, 2026 / 12:57 PM IST

దిగ్గజాల సరసన జాకబ్ బెథెల్

భారత్‌పై సెంచరీతో ఆకట్టుకున్న జాకబ్ బెథెల్(105) అరుదైన ఘనత సాధించాడు. ICC వైట్ బాల్ నాకౌట్స్‌లో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా మార్టిన్ గప్టిల్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. ODI WC నాకౌట్స్‌లో గప్టిల్(2015లో 237*) టాప్ స్కోరర్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో గంగూలీ(2000లో 141*)-సచిన్(1998లో 141). T20 WC నాకౌట్స్‌లో బెథెల్‌దే రికార్డ్.

March 7, 2026 / 11:59 AM IST

సెమీస్‌లో చివరి ఓవర్.. భయపడ్డా: దూబే

ఇంగ్లండ్‌తో T20 WC సెమీస్‌లో చివరి ఓవర్ వేసేది తానే అని తెలిసినప్పడు కొంత భయమేసిందని శివమ్ దూబే పేర్కొన్నాడు. సెమీస్‌లో చివరి ఓవర్ అంటే సవాలేనని, మ్యాచ్ ఫలితాన్ని మార్చగల తొలి 2 బంతులపై చాలా ఫోకస్ చేశానని తెలిపాడు. ఇక 30 పరుగులను డిఫెండ్ చేసే క్రమంలో దూబే వేసిన తొలి బంతికే.. నిలదొక్కుకుని ఆడుతున్న బెథెల్ రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ భారత్ సొంతమైంది.

March 7, 2026 / 11:38 AM IST

భారత్‌తో ఫైనల్.. న్యూజిలాండ్ బలాలివే!

తొలి T20 WC ట్రోఫీ కోసం న్యూజిలాండ్ రేపు భారత్‌తో తలపడనుంది. INDతో T20ల్లో 18-11తో వెనకబడినా.. T20 WCలో తలపడిన 3 సందర్భాల్లోనూ ఆ జట్టుదే విజయం. పైగా కెప్టెన్ శాంట్నర్, రచిన్, సోధితో IND కంటే బలమైన స్పిన్ అటాక్ కివీస్ సొంతం. టోర్నీలో IND బ్యాటింగ్ సగటు 27.31 అయితే NZది 41.68. ఇంకా IND ప్లేయర్లు 11 సార్లు డకౌట్ కాగా NZ బ్యాటర్లు 2 సార్లే అలా వెనుదిరిగారు.

March 7, 2026 / 11:19 AM IST

INDw vs AUSw: ఏకైక టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభం

భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. 96/3 స్కోరుతో తొలి రోజు ఆట ముగించిన ఆసీస్.. ఇంకా 102 రన్స్ వెనకబడి ఉంది. క్రీజులో పెర్రీ(43), అనాబెల్(20) ఉన్నారు. అటు తొలి ఇన్నింగ్స్‌లో హర్మన్ సేన 198 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. భారీ స్కోర్ చేయకుండా ప్రత్యర్థిని నిలువరించాలంటే.. ఇవాళ భారత్ ధాటిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.

March 7, 2026 / 10:50 AM IST

తిరుమలలో కేక్ వివాదం.. శ్రీనివాస్, మాధురి వివరణ

AP: తిరుమలలో బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్తడే సందర్భంగా కేక్ కట్ చేయడంతో రేగిన వివాదంపై దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వివరణ ఇచ్చారు. తిరుమలలో కేక్ కట్ చేయకూడదనే విషయం తమకు తెలియదని, తనూజతో తాము ఎగ్‌లెస్ కేక్‌నే కట్ చేయించామని పేర్కొన్నారు. తామే కేక్ తెచ్చామని, ఇందులో తనూజ పాత్ర ఏ మాత్రం లేదని తెలిపారు.

March 7, 2026 / 10:41 AM IST

4 సంకేతాలు.. T20 WC భారత్‌దేనా?

➤ 1983 ODI WC, 2007 T20 WCలో ZIM చేతిలో AUS ఓడింది.. IND టైటిల్ నిలిచింది. ఇప్పుడూ AUS అంతే ఓడింది ➤ 2011 ODI WCలో SA చేతిలో ఓడిన IND టైటిల్ గెలిచింది. ఇప్పుడూ IND ఓడింది. ➤ సొంతగడ్డపై ODI WC గెలిచిన జట్టుగా IND 2011లో నిలిచింది. స్వదేశంలో ఎవరూ గెలవలేకపోయిన T20 WCకి ఇప్పుడు INDనే హోస్ట్. ➤ T20 WC 2024లో ENGపై సెమీస్, ఆపై […]

March 7, 2026 / 09:56 AM IST

భారత్ ముంగిట ఒక్క ట్రోఫీ, 2 రికార్డులు

అంచనాలకు తగ్గట్టుగా భారత్ మళ్లీ T20 WC ఫైనల్‌కు చేరి, రేపు న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. అయితే టోర్నీలో ఇప్పటివరకు డిఫెండింగ్ ఛాంపియన్ కానీ, ఆతిథ్య జట్టు కానీ టైటిల్ గెలవలేదు. ఈ సారి భారత్ డిఫెండింగ్ ఛాంపియన్, అలాగే టోర్నీ ఆతిథ్య జట్టు. ఈ నేపథ్యంలో రేపటి తుదిపోరులో సూర్యసేన గెలిస్తే.. 19 ఏళ్ల T20 WC చరిత్రలో ఏ జట్టుకూ సాధ్యం కాని ఈ 2 ఘనతలను అందుకుంటుంది.

March 7, 2026 / 08:56 AM IST

రేపే T20 వరల్డ్ కప్ ఫైనల్

నెల రోజులుగా క్రికెట్ ప్రపంచానికి వినోదం పంచిన T20 వరల్డ్ కప్ తుదిదశకు చేరుకుంది. వరుసగా 2వ సారి ఈ టైటిల్ సొంతం చేసుకునేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ రేపు అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. టైటిల్ నిలుపుకోవాలని సూర్యసేన.. T20 ఫార్మాట్‌లో తొలి ICC టైటిల్ సాధించాలని శాంట్నర్ నేతృత్వంలోని కివీస్ భావిస్తున్నాయి. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

March 7, 2026 / 08:26 AM IST

న్యూజిలాండ్‌తో ఫైనల్.. అభిషేక్‌ను తప్పిస్తారా?

T20 WCలో టీమిండియాకు బలంగా మారతాడనుకున్న అభిషేక్ శర్మ.. పెద్ద తలనొప్పిగా మారాడు. పసికూన జింబాబ్వేపై 55 మినహా.. ప్రదర్శన అంతా పేలవం. పదేపదే ప్రత్యర్థి వ్యూహానికి దొరికిపోతున్నాడు. దీంతో రేపు న్యూజిలాండ్‌తో జరిగే టైటిల్ పోరు నుంచి అతణ్ని తప్పించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే రింకూ కూడా రాణించలేకపోతుండటంతో ఫైనల్‌లో అభిషేక్‌నే ఆడించే అవకాశాలు ఎక్కువ.

March 7, 2026 / 07:30 AM IST

అమరావతిపై చిన్నజీయర్ కీలక వ్యాఖ్యలు

AP: రాష్ట్ర రాజధాని అమరావతిపై చిన్నజీయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఏర్పడిన అమరావతి రాజధానిని మధ్యలో కొందరు తరలించాలని చూశారన్నారు. అయితే స్వామి కృపతో ఆ ప్రయత్నాలు సఫలం కాలేదని పేర్కొన్నారు. ఇక 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి అమరావతి రాజధాని పనులను వేగవంతం చేసింది. ఈ క్రమంలో చిన్నజీయర్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధన్యత సంతరించుకున్నాయి.

March 7, 2026 / 07:20 AM IST

GET READY: ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్

గిరిజన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గానూ ఈనెల 25 నుంచి ఏప్రిల్ 6 వరకు కేంద్ర క్రీడాశాఖ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ నిర్వహించనుంది. కేంద్ర క్రీడాశాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత ఒలింపిక్ సంఘం, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్, ఛత్తీస్‌గఢ్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. రాయ్‌పూర్, జగ్‌దల్‌పూర్, సర్గుజాలో పోటీలు నిర్వహించనున్నారు.

March 7, 2026 / 05:55 AM IST