VSP: జిల్లాకు చెందిన ఓలింపియన్ ఎర్రాజి జ్యోతి మరో అంతర్జాతీయ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫ్రాన్స్లో నాంటెక్స్ మెట్రో పోల్లో జరిగిన ఎలైట్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో మహిళల 60 మీటర్ల హార్డిల్స్లో మంచి ప్రతిభ కనపర్చి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. పతకం సాధించిన జ్యోతిని పలువురు అభినందిస్తున్నారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా జనిక్ సిన్నర్ నిలిచాడు. ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్పై 6-3, 7-6, 6-3 తేడాతో సిన్నర్ విజయం సాధించాడు. దీంతో ఇటలీ ఖాతాలో వరుసగా రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ చేరింది. విన్నర్గా నిలవాలనుకున్న జ్వెరెన్కు నిరాశ మిగిలింది. కెరీర్లో మూడు గ్రాండ్ స్లామ్స్ గెలిచాడు.
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా బౌలర్ అర్ష్దీప్ చరిత్ర సృష్టించాడు. సాల్ట్, డకెట్ను ఔట్ చేయడం ద్వారా T20ల్లో అత్యధిక వికెట్లు(97) తీసిన భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు చాహల్(96) పేరిట ఉండేది. అలాగే మరో 3 వికెట్లు తీస్తే టీ20ల్లో 100 వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్గా అర్ష్దీప్ నిలుస్తాడు.
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో విఫలమైన విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే ఫార్మాట్లో కోహ్లీతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు చాలా కీలకం అవుతాడని అభిప్రాయపడ్డాడు. ఓటమిని ఓ పట్టాన కోహ్లీ అంగీకరించడని.. టీమ్లో అతడు స్ఫూర్తిని నింపుతాడని కైఫ్ అన్నాడు.
ప్రకాశం: ఢిల్లీలో జరిగిన ఖోఖో ప్రపంచ కప్లో భారత్ జట్టు విజేతగా నిలిచింది. జట్టు విజయంలో పోతిరెడ్డి శివారెడ్డి కీలక పాత్ర పోషించాడు. అతనిది ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శివారెడ్డి భారత జట్టుని విజేతగా నిలపడంతో ముండ్లమూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్-2025 సీజన్ మార్చిలో ప్రారంభం కానుంది. ఈ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ టీంలో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఈ టీమ్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఉండగా ఇప్పుడు రిషభ్ పంత్ను తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తమ టీమ్ కెప్టెన్ ఎవరన్న విషయం సోమవారం అధికారికంగా ప్రకటిస్తామని ఎల్ఎస్జీ తెలిపింది.
KMR: ఎల్లారెడ్డి ఒక్కొక్క కబడ్డీ జట్టును పరాజయం చేస్తూ హాజిపూర్ తండా కబడ్డీ జట్టు ఘనవిజయం సాధించి మొదటి విజేతగా నిలిచి రూ. 51,000 వేల నగదు బహుమతిని గెలుపొందారు. రెండవ విజేతగా ఎల్లారెడ్డి టీం (A)రూ. 21, 000 నగదు అందుకున్నారు. మూడవ విజేతగా జాయింట్ విన్నర్( భిక్కనూర్, మాచాపూర్) రూ.11,000 నగదు పొందారు. సీఐ రవీందర్ నాయక్ బహుమతులను అందజేశారు.
ఆస్ట్రేలియా పర్యటనలో భారత డ్రెస్సింగ్ రూమ్ విషయాలను లీక్ చేసినట్లు సర్ఫరాజ్ ఖాన్పై ఆరోపణలు వచ్చాయి. అతడిపై హెడ్ కోచ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. సర్ఫరాజ్పై వస్తోన్న ఆరోపణలు నిజమని ఇప్పుడే చెప్పలేమని అన్నాడు. ఒకవేళ అలా జరిగితే మాత్రం అది పెద్ద తప్పిదమేనని.. అతడితో గంభీర్ ప్రత్యేకంగా మాట్లాడాలని సూచించాడు.
KKD: పెద్దాపురం స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో శుక్రవారం నుంచి 22వ తేదీ వరకు జాతీయ చెస్ చాంపియన్షిప్-2025 పోటీలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 28 రాష్ట్రాలకు చెందిన 1,239 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. చెస్ ఆర్బిటర్స్, వాలంటీర్లు, క్రీడాకారుల తల్లిదండ్రులు సుమారు వెయ్యి మంది వస్తారన్నారు.
ఐర్లాండ్ మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు భారీ విజయం సాధించింది. 436 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్.. 31.4 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో తనూజా 2, దీప్తి 3, సయాలీ 1, సాధు 1, మిన్ను మని 1 వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 435/5 రికార్డు స్కోరు చేసింది. ప్రతికా రావల్(154), స్మృతీ మంధాన(135) శతకాలు చేశారు.
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, అశ్విన్కు అవమానం జరగడంతోనే తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అభిమానులు నెట్టింట కామెంట్లు చేశారు. తాజాగా వీటిపై అశ్విన్ స్పందించాడు. ‘బయట అనుకొనేవన్నీ నిజాలు కాదు. నేను బ్రేక్ కావాలని నిర్ణయించుకున్నా. అందుకే, సిరీస్ మధ్యలోనే వచ్చేశా. అంతకంటే మరే కారణం లేదు’ అని పేర్కొన్నాడు.
SS: షూటింగ్ బాల్ పోటీల్లో శ్రీసత్యసాయి జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు.జిల్లాకు చెందిన నలుగురు 43వ జూనియర్స్ నేషనల్ ఏపీ షూటింగ్ బాల్ పోటీలకు సెలెక్టయ్యారని జిల్లా షూటింగ్ బాల్ ప్రెసిడెంట్ శీను,సెక్రటరీ ఉదయ్ వెల్లడించారు.ఒడిశా రాష్ట్రం జగన్నాథ స్టేడియంలో ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే పోటీల్లో హిందూపురానికి చెందిన దివ్య, హారిక పాల్గొంటారు.
ATP: రాయదుర్గంలోని కె టి ఎస్ డిగ్రీ కళాశాలలో మైక్రో బయాలజీ ద్వితీయ ఏడాది చదువుతున్న యోగేశ్వరి,గోపాల్ ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన వారిలో నిలిచారు. ఇటీవల 15 రోజులపాటు ఉత్తర కాశీలోని హిమాలయ పర్వతారోహణకు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా 17 ఎన్సిసి కమాండెంట్లకు చెందిన క్యాడేట్లు హాజరుకాగా ఏపీ తరఫున యోగేశ్వరి గోపాల్ ఇద్దరే ఉండడం గమనార్హం.
సిడ్నీ టెస్టు సందర్భంగా తొలి రోజు ఆట ముగిసే సమయంలో బుమ్రా, ఆసీస్ ఓపెనర్ సామ్ కొన్స్టాస్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ గొడవపై రిషభ్ పంత్ స్పందించాడు. సమయం వృథా చేయాలనే వ్యూహంలో భాగంగానే బుమ్రాతో కొన్స్టాన్ గొడవకు దిగాడని పంత్ అభిప్రాయపడ్డాడు. మరో ఓవర్ వేయకుండా సమయాన్ని వృథా చేయాలని కొన్స్టాన్ భావించినట్లు పేర్కొన్నాడు.
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో రోహిత్ శర్మ ఆడటం లేదు. విశాంత్రి పేరుతో రోహితే బెంచ్పై కూర్చున్నాడని బుమ్రా తెలిపాడు. ఈ క్రమంలో హిట్మ్యాన్కి విశ్రాంతి అని చెబుతున్నా.. అది తప్పించడమేనని ఆసీస్ మాజీ క్రికెటర్ మార్క్ టేలర్ వ్యాఖ్యానించాడు. ఇది సిరీస్ నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ అని.. అందుకే, అతడిని తప్పించారని పేర్కొన్నాడు.