పాకిస్థాన్తో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించింది. మార్క్రమ్ 37, తెంబా బావుమా 40 పరుగులతో రాణించారు. అయితే, వరుసగా వికెట్లు కోల్పోయిన సమయంలో కగిసో రబాడ 31* కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు.
BGTలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ వేదికగా భారత్ నాలుగో టెస్టు ఆడుతోంది. ప్రస్తుతం ఆసీస్ 333 పరుగుల లీడ్ సాధించింది. అయితే ఈ మ్యాచులో భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డు తుడిచిపెట్టుకుపోనుంది. మెల్ బోర్న్ మైదానంలో ఆసీస్పై 1928లో టెస్టులో ఇంగ్లాండ్ 332 పరుగులను ఛేదించింది. ఇప్పుడు భారత్ గెలిస్తే ఆ రికార్డును అధిగమిస్తుంది.
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ నాలుగోవ రోజు ఆట ముగిసింది. ఆసీస్ 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. దీంతో 333 రన్స్ ఆధిక్యంలో ఉంది. క్రీజ్లో లైయన్ (41*), బోలాండ్ (10*) ఉన్నారు. ఖవాజా 21, కొన్స్టాప్ 8, స్మిత్ 13, హెడ్ 1, మార్ష్ 0, కారే 2, కమిన్స్ 41, లబుషేన్ 70, స్టార్క్ 5 రన్స్ చేశారు. బుమ్రా 4, సిరాజ్ 3, జడేజా 1 వికెట్ […]
BDK: అంతరాష్ట్ర క్రికెట్ పోటీలు నేటి నుంచి జనవరి 5 వరకు జరగనున్న సందర్భంగా ఆదివారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ తెలం వెంకట్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రీడలను ప్రారంభించారు. నేటి యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా క్రీడలకు అలవాటు కావాలని ఎమ్మెల్యే తెలిపారు.
వనపర్తి: రాష్ట్ర స్థాయి సీఎం కప్ బాక్సింగ్ పోటీల్లో వనపర్తి మండలం చిట్యాల విద్యార్థిని సింగరపు ఝాన్సీ బంగారు పతకం సాధించినట్లు చిట్యాల కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అకాడమీ మాస్టర్ వరుణ్ ఆదివారం తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అండర్ 13, 14, 15 విభాగాల్లో 45 కేజీల పాయింట్ ఫైట్ 4 రౌండ్లలో పాల్గొని పతకం సాధించారని వెల్లడించారు.
తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అద్భుతమైన ఘనత సాధించింది. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో భాగంగా ర్యాపిడ్ ఛాంపియన్గా హంపి నిలిచింది. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లి విజయం సాధించింది. చైనా గ్రాండ్మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్గా హంపి రికార్డు దక్కించుకుంది.
ADB: రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన ఆత్రం స్వప్న, శ్రావణి జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ మహిళా జట్టుకు ఎంపికయినట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్య దర్శి నారాయణరెడ్డి తెలిపారు. స్వప్న రాష్ట్ర మహిళా జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తుందన్నారు. ఆయనతో పాటు పలువురు వారిని అభినందించారు.
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతుంది. టీ బ్రేక్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. దీంతో 240 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్లో లబుషేన్ (65*), పాట్ కమిన్స్ (21*) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 2 వికెట్లు తీశారు.
టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలు రాయిని చేరుకున్నాడు. ఓవరాల్గా నాలుగో పేసర్గా బుమ్రా నిలిచాడు. ట్రావిస్ హెడ్ను ఔట్ చేసిన తర్వాత బుమ్రా ఈ రికార్డును సాధించాడు. కెరీర్లో 44వ టెస్టు ఆడుతున్న బుమ్రా కేవలం 8,484 బంతుల్లో 200+ వికెట్ల మార్క్ను అందుకొన్నాడు.
HYD: గచ్చిబౌలీ బాలయోగి స్టేడియంలో జాతీయ మాస్టర్స్ అథ్లెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మాస్టర్స్ క్రీడ పోటీలు జనవరి 4, 5వ తేదీన నిర్వహించనున్నట్లు మాస్టర్స్ అధ్యక్షుడు మర్రి లక్ష్మణ్ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి కొండ విజయ్ కుమార్ తెలిపారు. ఈ పోటీలకు ఇతర రాష్ట్రాల అభ్యర్థుల సైతం పాల్గొంటారన్నారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ఆసీస్ 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఖవాజా 21, కొన్స్టాప్ 8, స్మిత్ 13, హెడ్ 1, మార్ష్ 0, కారే 2 స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేరారు. బుమ్రా 4, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. క్రీజులో లబుషేన్(43*), కమిన్స్ ఉన్నారు. ప్రస్తుతం 196 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా ఉంది.
NRML: రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన కనబరిచినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ప్రకటనలో తెలిపారు. వెయిట్ లిఫ్టింగ్ 77 కిలోల విభాగంలో సారంగాపూర్ కళాశాలకు చెందిన వర్షిని బంగారు పతకం,102 కిలోల విభాగంలో దస్తురాబాద్ మండలం ప్రభుత్వ పాఠశాలకు చెందిన అభిషేక్ కాంస్య పతకం సాధించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్నటెస్టు మ్యాచ్లో నాలుగో రోజు తొలి సెషన్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ఉస్మాన్ ఖవాజా(21), కొన్స్టాప్(8) వికెట్లను కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 53/2 స్కోరు చేసింది. క్రీజులో లబుషేన్(20), స్మిత్(2) ఉన్నారు. బుమ్రా, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా 158 పరుగుల ఆధిక్యంలో ఉంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో నాలుగో రోజు టీమిండియా 369 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ఆధిక్యం 105 పరుగులకు చేరింది. భారత బ్యాటర్లలో నితీష్ 114, జైస్వాల్ 82, సుందర్ 50 రన్స్తో రాణించారు. ఆసీస్ బౌలర్లలో కమీన్స్, బొలాండ్ లయన్కు తలో 3 వికెట్లు పడగొట్టారు. నిన్నటి స్కోర్కు కేవలం 11 పరుగులు మాత్రమే జోడించి భారత జట్టు ఆలౌట్ అయింది.
WNP: అమరచింత మండల కేంద్రంలోని స్థానిక విజేత మోడల్ స్కూల్ విద్యార్థిని నిక్షిత ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన జూనియర్ కబడ్డీ మీట్లో చక్కటి ప్రతిభ కనబరిచి తృతీయ స్థానంలో నిలిచింది. శనివారం వనపర్తి జిల్లా కబడ్డీ సంఘం సెక్రటరీ రాము, అడిషనల్ సెక్రటరీ కురుమూర్తి క్రీడాకారిణి నిక్షితను సత్కరించి అభినందించారు.