మెల్బోర్న్ వేదికగా కాసేపట్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా భారత్ మళ్లీ టాస్ ఓడింది. అయితే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.
భారత హాకీ దిగ్గజం మాన్యుయేల్ ఫ్రెడెరిక్ కన్నుమూశారు. క్యాన్సర్తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. కాగా కేరళకు చెందిన ఫ్రెడెరిక్.. ఒలింపిక్ పతకం గెలిచిన మొదటి క్రీడాకారుడు. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో హాలాండ్ను ఓడించి కాంస్య పతకం గెలవడంలో ఆయన గోల్కీపర్గా కీలక పాత్ర పోషించారు.
మహిళల వన్డే ప్రపంచకప్లో టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ‘ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థిపై మన టీమ్ సాధించిన విజయం అద్భుతం. అమ్మాయిలు గొప్పగా ఛేదించారు. జెమీమా కీలక మ్యాచ్లో అసాధారణ ప్రదర్శన చేసింది. ఇది పట్టుదల, అభిరుచికి నిజమైన నిదర్శనం. వెల్ డన్ టీమిండియా’ అని ‘X’లో పోస్ట్ చేశాడు.
మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు టీమిండియా దూసుకెళ్లింది. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిమానులకు ఓ హామీ ఇచ్చాడు. మహిళల వన్డే ప్రపంచ కప్ భారత్ గెలిస్తే.. సెమీస్లో సెంచరీ చేసిన జెమీమాతో కలిసి పాట పాడతానని వెల్లడించాడు. అయితే, జెమీమా అందుకు అంగీకరిస్తేనేనని స్పష్టం చేశాడు.
నిన్న ఆసీస్తో జరిగిన మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్ను ఫైనల్ చేర్చిన జెమీమా.. తొలి మ్యాచుల్లో అస్సలు క్లిక్ అవ్వలేదు. రెండు సార్లు బాగా ఆడుతోంది అనిపించినా ఔటై నిరాశపరిచింది. ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు సార్లు డకౌట్ అయింది. దీంతో మేనేజ్ మెంట్.. ఆమెను పక్కన పెట్టింది. కానీ రీ ఎంట్రీలో తనదైన శైలిలో అదరగొట్టి ఏకంగా జట్టును ఫైనల్కి చేర్చింది.
జీసస్ వల్లే విజయం సాధ్యమైందని.. ఆయనే తనను నడిపించాడని టీమిండియా మహిళా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ తెలిపింది. నిన్న సెమీస్-2లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో జెమీమా 134 బంతుల్లో 127 నాటౌట్గా నిలిచి.. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ అద్భుత శతకంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన జెమీమా.. హోస్ట్తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది.
మహిళల ప్రపంచ కప్లో భాగంగా జరిగన ఉత్కంఠభరిత పోరులో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. ఈ కీలక మ్యాచ్లో జెమీమా రోడ్రిగ్స్ సెంచరీతో (127*) చెలరేగింది. భారత జట్టు లక్ష్య ఛేదనలో ఆమె అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆమె మెరుపు ఇన్నింగ్స్తో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో ఛేదించింది. WC చరిత్రలో నాకౌట్ మ్యాచ్లలో ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించింన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో జెమీమా రోడ్రిగ్స్ (115*), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(89) పరుగులతో రాణించి భారత్కు అద్భుత విజయాన్ని అందించారు.
మహిళల వన్డే WC ఫైనల్కు భారత్ అర్హత సాధించింది. సెమీఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్లో 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 48.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. జెమీమా రోడ్రిగ్స్(127*), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(89) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, శ్రీ చరణి తలో రెండు వికెట్లు పడగొట్టారు.
మహిళల వన్డే WC ఫైనల్కు భారత్ అర్హత సాధించింది. సెమీఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్లో 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 48.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. జెమీమా రోడ్రిగ్స్(127*), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(89) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, శ్రీ చరణి తలో రెండు వికెట్లు పడగొట్టారు.
339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న భారత్ జట్టు, ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇస్తోంది. 41.4 ఓవర్లు ముగిసేసరికి భారత్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 269 పరుగులు చేసింది. భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ సెంచరీతో అదరగొట్టింది. అయితే, విజయానికి భారత్కు ఇంకా 70 పరుగులు కావాలి.
ఆస్ట్రేలియాతో WC సెమీఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. 35 ఓవర్లు ముగిసేసరికి భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 226 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(89*), జెమీమా రోడ్రిగ్స్ (85*) హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. భారత్ విజయానికి ఇంకా 113 పరుగులు చేయాలి. దీంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఆస్ట్రేలియాతో WC సెమీఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. 32 ఓవర్లు ముగిసేసరికి భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 201 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(68*), జెమీమా రోడ్రిగ్స్ (82*) హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. భారత్ విజయానికి ఇంకా 138 పరుగులు చేయాలి. దీంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ త్వరలో కోచ్గా కొత్త అవతారం ఎత్తనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ అతడిని తమ జట్టుకు ప్రధాన కోచ్గా నియమించడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ జట్టుకు ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో విజేతకు దక్కే ప్రైజ్మనీ భారీగా పెరిగింది. గతంలో విజేతకు అందిన రూ. 31 కోట్ల మొత్తాన్ని ఇప్పుడు రూ. 40 కోట్లకు పెంచారు. అంతేకాకుండా, ఫైనల్లో ఓడిపోయి రన్నరప్గా నిలిచిన జట్టు రూ. 20 కోట్లు అందుకోనుంది. అలాగే, సెమీఫైనల్స్కు చేరుకున్న జట్లకు కూడా రూ. 10 కోట్లు చొప్పున ప్రైజ్మనీ దక్కనుంది.