భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ICC మహిళల వరల్డ్ కప్ను గెలుచుకుంది. అయితే, 2024-25లో హర్మన్ నికర ఆస్తులు రూ.25 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఆదాయం క్రికెట్ నుంచే కాకుండా, ఎండార్స్మెంట్, బ్రాండ్ అగ్రిమెంట్లు, లీగ్ క్రికెట్ నుంచి కూడా వస్తుంది. టెస్టు మ్యాచుకు రూ.15 లక్షలు, వన్డే రూ.6 లక్షలు, T20 రూ.3 లక్షలు తీసుకుంటుంది.
ఇటీవల జరిగిన పలు మ్యాచులలో టాస్ ఓడుతూ వచ్చిన భారత్.. హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో ఎట్టకేలకు టాస్ గెలిచింది. దీంతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడి 0-1 తేడాతో వెనుకబడిన భారత్.. ఈ మ్యాచులో గెలిచి లెక్క సమం చేయాలనే యోచనలో ఉంది.
WWC 2025 Final: సౌతాఫ్రికాతో బిగ్ ఫైట్కు సిద్ధమవుతున్న భారత మహిళా జట్టుకు టీమిండియా అబ్బాయిలు, కోచింగ్ స్టాఫ్ తమ బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఆత్మవిశ్వాసంతో ఒక్కటిగా రాణించి గెలవాలని, కప్ సాధిస్తారని తమకు నమ్మకముందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ T20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. వరల్డ్ కప్ టోర్నీకి 4 నెలల ముంగిట ఆయన రిటైర్ అవడం గమనార్హం. కాగా 2011లో T20 అరంగేట్రం చేసిన కేన్ మొత్తం 93 మ్యాచుల్లో 18 ఫిఫ్టీలతోపాటు 2575 రన్స్ చేశాడు. ఇందులో 75 మ్యాచుల్లో జట్టును నడిపించాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 T20ల సిరీసులో భాగంగా ఇవాళ 3వ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఓ మ్యాచ్ గెలిచిన AUS 1-0తో ఆధిక్యంలో ఉండగా.. లెక్క సమం చేసే యోచనలో IND ఉంది. మరోవైపు బ్యాటింగ్ ఆర్డర్ మార్పులపై విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ రోజు భారత జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. అటు ఈ మ్యాచులోనైనా అర్ష్దీప్కి ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో మొదటి ఓవర్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచాడు. అతడు ఇప్పటివరకు తొలి ఓవర్లో మొత్తంగా 24 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, గతంలో ఈ రికార్డు ఒమన్ పేసర్ బిలాల్ ఖాన్ పేరిట ఉండేది.
రంజీ ట్రోఫీ-2025లో టీమిండియా వెటరన్ ప్లేయర్ కరుణ్ నాయర్ అదరగొడుతున్నాడు. తిరువనంతపురం వేదికగా కేరళతో జరుగుతున్న మ్యాచ్లో కరుణ్ నాయర్ సెంచరీతో చెలరేగాడు. 163 బంతుల్లో తన 26వ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ప్రస్తుతం 142 పరుగుల వద్ద తన బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. దీంతో సెలక్టర్లకు నాయర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
RCB మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధాన ఆ జట్టుకు గుడ్బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా కన్నడ రాజ్యోత్సవం పురుస్కరించుకుని RCB సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో స్మృతి మినహా RCB స్టార్ ప్లేయర్లంతా కనిపించారు. దీంతో ఆమె జట్టను వీడుతుందనే సందేహాలు మొదలయ్యాయి. అయితే, ప్రపంచకప్ టోర్నీతో బిజీగా ఉండటంతో ఆమె ఫ్రాంఛైజీకి అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.
భారత్-A, దక్షిణాఫ్రికా-A మధ్య జరుగుతున్న తొలి అనాధికార టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. 275 పరుగుల లక్ష్య చేధనలో ఆట ముగిసే సమయానికి భారత్-A నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (64*) హాఫ్ సెంచరీ చేశాడు. ఇంకా ఒక్క రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో భారత్-A విజయానికి 156 పరుగులు చేయాల్సి ఉంది.
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా రేపు దక్షిణాఫ్రికాతో టీమిండియా టైటిల్ కోసం తలపడనుంది. నవీ ముంబై వేదికగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఇప్పటివరకు టికెట్లు అందుబాటులో లేకపోవడంతో అభిమానులు విమర్శలు గుప్పించారు. బుక్మై షోలో ఇంకా టికెట్ల విక్రయం మొదలుకాలేదు. దీంతో టికెట్ల కోసం అభిమానులు పడిగాపులు కాస్తున్నారు.
ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 222 పరుగులకే ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్ 44.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను కివీస్ క్లీన్ స్వీప్ చేసింది. కాగా, వన్డే సిరీస్లో ఇంగ్లండ్ను కివీస్ వైట్ వాష్ చేయడం 42 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
WWCలో భాగంగా రేపు దక్షిణాఫ్రికాను టీమిండియా ఢీకొట్టనుంది. అయితే, సఫారీ జట్టు బౌలింగ్తో భారత్కు ఇబ్బందులు తప్పవు. ఆ జట్టు స్టార్ పేసర్ కాప్ ప్రత్యర్థులను ఒత్తిడికి గురి చేస్తోంది. బలమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ను ఆమె దెబ్బ కొట్టి ఐదు వికెట్ల ప్రదర్శన చేసింది. దీంతో ఆమెను ఎదుర్కొంటే మిగితా బౌలర్లను భారత బ్యాటర్లు తేలికగానే ఎదుర్కోవచ్చు.
WWCలో భాగంగా రేపు సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో హర్మన్ప్రీత్ సేన గెలిస్తే BCCI భారీ బొనాంజా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పురుషుల జట్టుతో సమానంగా భారీ నజరానా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన రోహిత్ సేనకు బోర్డు రూ.125 కోట్ల ప్రైజ్మనీ ప్రకటించింది. ఇప్పుడు మహిళలకు కూడా అంతే మొత్తం ఇవ్వనున్నట్లు సమాచారం.
ఆసియాకప్ విషయంలో ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ పట్టువిడవడం లేదు. దీంతో మరోసారి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. మోసిన్ చేతులమీదుగా తాము ట్రోఫీని తీసుకొనేది లేదని తేల్చి చెప్పారు. ఈనెల 4లోగా బీసీసీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆసియాకప్ భారత్కు తప్పకుండా వచ్చి చేరుతుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని తెలిపారు.