ఐర్లాండ్ మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు భారీ విజయం సాధించింది. 436 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్.. 31.4 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో తనూజా 2, దీప్తి 3, సయాలీ 1, సాధు 1, మిన్ను మని 1 వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 435/5 రికార్డు స్కోరు చేసింది. ప్రతికా రావల్(154), స్మృతీ మంధాన(135) శతకాలు చేశారు.
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, అశ్విన్కు అవమానం జరగడంతోనే తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అభిమానులు నెట్టింట కామెంట్లు చేశారు. తాజాగా వీటిపై అశ్విన్ స్పందించాడు. ‘బయట అనుకొనేవన్నీ నిజాలు కాదు. నేను బ్రేక్ కావాలని నిర్ణయించుకున్నా. అందుకే, సిరీస్ మధ్యలోనే వచ్చేశా. అంతకంటే మరే కారణం లేదు’ అని పేర్కొన్నాడు.
SS: షూటింగ్ బాల్ పోటీల్లో శ్రీసత్యసాయి జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు.జిల్లాకు చెందిన నలుగురు 43వ జూనియర్స్ నేషనల్ ఏపీ షూటింగ్ బాల్ పోటీలకు సెలెక్టయ్యారని జిల్లా షూటింగ్ బాల్ ప్రెసిడెంట్ శీను,సెక్రటరీ ఉదయ్ వెల్లడించారు.ఒడిశా రాష్ట్రం జగన్నాథ స్టేడియంలో ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే పోటీల్లో హిందూపురానికి చెందిన దివ్య, హారిక పాల్గొంటారు.
ATP: రాయదుర్గంలోని కె టి ఎస్ డిగ్రీ కళాశాలలో మైక్రో బయాలజీ ద్వితీయ ఏడాది చదువుతున్న యోగేశ్వరి,గోపాల్ ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన వారిలో నిలిచారు. ఇటీవల 15 రోజులపాటు ఉత్తర కాశీలోని హిమాలయ పర్వతారోహణకు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా 17 ఎన్సిసి కమాండెంట్లకు చెందిన క్యాడేట్లు హాజరుకాగా ఏపీ తరఫున యోగేశ్వరి గోపాల్ ఇద్దరే ఉండడం గమనార్హం.
సిడ్నీ టెస్టు సందర్భంగా తొలి రోజు ఆట ముగిసే సమయంలో బుమ్రా, ఆసీస్ ఓపెనర్ సామ్ కొన్స్టాస్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ గొడవపై రిషభ్ పంత్ స్పందించాడు. సమయం వృథా చేయాలనే వ్యూహంలో భాగంగానే బుమ్రాతో కొన్స్టాన్ గొడవకు దిగాడని పంత్ అభిప్రాయపడ్డాడు. మరో ఓవర్ వేయకుండా సమయాన్ని వృథా చేయాలని కొన్స్టాన్ భావించినట్లు పేర్కొన్నాడు.
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో రోహిత్ శర్మ ఆడటం లేదు. విశాంత్రి పేరుతో రోహితే బెంచ్పై కూర్చున్నాడని బుమ్రా తెలిపాడు. ఈ క్రమంలో హిట్మ్యాన్కి విశ్రాంతి అని చెబుతున్నా.. అది తప్పించడమేనని ఆసీస్ మాజీ క్రికెటర్ మార్క్ టేలర్ వ్యాఖ్యానించాడు. ఇది సిరీస్ నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ అని.. అందుకే, అతడిని తప్పించారని పేర్కొన్నాడు.
WGL: ప్రతిభ గల క్రికెటర్లను గుర్తించడానికి తెలంగాణ గోల్డ్ కప్-2025 క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ క్రికెట్ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు డా.విజయ చందర్ రెడ్డి తెలిపారు. జనవరి 8 నుంచి 18 వరకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, మొగిలిచర్లలోని క్రికెట్ మైదానాల్లో టీ- 20 ఫార్మాట్లో పోటీలు ఉంటాయని తెలిపారు.
WGL: ప్రతిభ గల క్రికెటర్లను గుర్తించడానికి తెలంగాణ గోల్డ్ కప్-2025 క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ క్రికెట్ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు డా.విజయ చందర్ రెడ్డి తెలిపారు. జనవరి 8 నుంచి 18 వరకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, మొగిలిచర్లలోని క్రికెట్ మైదానాల్లో టీ- 20 ఫార్మాట్లో పోటీలు ఉంటాయని తెలిపారు.
WGL: ప్రతిభ గల క్రికెటర్లను గుర్తించడానికి తెలంగాణ గోల్డ్ కప్-2025 క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ క్రికెట్ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు డా.విజయ చందర్ రెడ్డి తెలిపారు. జనవరి 8 నుంచి 18 వరకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, మొగిలిచర్లలోని క్రికెట్ మైదానాల్లో టీ- 20 ఫార్మాట్లో పోటీలు ఉంటాయని తెలిపారు.
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. ఆసీస్ చేతిలో 184 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలో ఆసీస్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ ఆశలను భారత్ సంక్లిష్టం చేసుకుంది. దాదాపు ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించినట్లైంది.
మాజీ ప్రధాని, దివంగత నేత మన్మోహన్ సింగ్కు భారతరత్న ప్రకటించాలనే డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది. అయితే మన్మోహన్ను భారతరత్నతో సత్కరించాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భావించారట. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గొప్ప ఆర్థిక వేత్త అని 2013లోనే ప్రణబ్ ముఖర్జీ తన డైరీలో రాసుకున్నట్లు ఆయన కూతురు శరిష్ఠ ముఖర్జీ తాజాగా వెల్లడించారు.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆసీస్ బౌలర్ల ధాటికి తలవంచింది. జైస్వాల్(84) ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఏడు వికెట్లను భారత్ 35 పరుగుల తేడాతో కోల్పోయింది. కాగా ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యం సంపాదించింది.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆసీస్ బౌలర్ల ధాటికి తలవంచింది. జైస్వాల్(84) ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఏడు వికెట్లను భారత్ 35 పరుగుల తేడాతో కోల్పోయింది. కాగా ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యం సంపాదించింది.
మెల్బోర్న్ టెస్టులో నిలకడగా రాణిస్తున్న యశస్వి జైస్వాల్ ఔటయ్యాడు. అయితే.. యశస్వి ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. తొలుత ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ఆసీస్ డీఆర్ఎస్ తీసుకుంది. సమీక్షలో థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఈ నిర్ణయంపై యశస్వి అసహనం వ్యక్తం చేశాడు. స్నికో మీటర్లో స్రైక్స్ రాకపోయినా.. బంతి టర్న్ అయిందనే కారణంతో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు.
మెల్బోర్న్ టెస్టులో ట్రావిస్ హెడ్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. హెడ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి పంత్ ఔటయ్యాడు. ఈ క్రమంలో హెడ్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. హెడ్ను అన్ని ICC నాకౌట్ మ్యాచ్ల నుంచి నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. మ్యాచ్ను పిల్లలు సైతం చూస్తున్నారని.. హెడ్ అలా వ్యవహరించడం సరికాదని మండిపడుతున్నారు.