ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడిపోయింది. దీంతో 2023 ప్రపంచ కప్ ఫైనల్ నుంచి టీమిండియా వరుసగా వన్డేల్లో 12 మ్యాచ్ల్లో టాస్ ఓడిన జట్టుగా వరల్డ్ రికార్డు నమోదు చేసింది. కాగా, నెదర్లాండ్స్(11) పేరిట ఉన్న రికార్డ్ను భారత్ బ్రేక్ చేసింది.
WPLలో వరుసగా రెండు ఓటముల తర్వాత యూపీ వారియర్స్ బోణీ కొట్టింది. 33 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. యూపీ మొదట 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు సాధించింది. ఛేజింగ్లో ఢిల్లీ 144కు ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (56) పోరాటం వృథా అయ్యింది. క్రాంతి గౌడ్ (4/25) ఆ జట్టును దెబ్బకొట్టింది. గ్రేస్ హ్యారిస్ (4/15) హ్యాట్రిక్ సాధించింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ENGతో జరుగుతున్న మ్యాచ్లో AUS టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ENG: సాల్ట్, డకెట్, స్మిత్, రూట్, బ్రూక్, బట్లర్ (కెప్టెన్), లివింగ్స్టోన్, కార్సే, ఆర్చర్, రషీద్, వుడ్AUS: హెడ్, షార్ట్, స్టీవ్ స్మిత్ (సి), లబుషేన్, ఇంగ్లిస్, క్యారీ, మాక్స్వెల్, ద్వార్షుయిస్, ఎల్లీస్, జంపా, స్పెన్సర్ జాన్సన్
బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 70 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 50* పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో వరుసగా 4వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. గతంలో ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో 87, 60, 112 పరుగులు సాధించాడు.
WPL-3లో భాగంగా యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత యూపీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కిరణ్ నవ్గిరే (51) అర్ధ శతకం చేసింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మెగ్ లానింగ్ (69), అన్నాబెల్ సదర్లాండ్ (41) రాణించారు.
కరాచీ వేదికగా జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లో కివిస్ ఓపెనర్ విల్యంగా సత్తా చాటాడు. 107 బంతుల్లో సెంచరీ చేశాడు. అందులో ఒక సిక్స్, 11 ఫోర్లు ఉన్నాయి. వన్డే కెరీర్లో అతడికిది నాలుగో సెంచరీ. క్రీజులో ఉన్న మరో కివిస్ ఆటగాడు లేథమ్ కూడా అర్థ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం కివిస్ స్కోర్ 34.3 ఓవర్లలో 173/3
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచులో న్యూజిలాండ్తో పాకిస్థాన్ తలపడుతోంది. దీంట్లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, ఈ రెండు టీంలు టీమిండియా తలపడే గ్రూపులోనే ఉన్నాయి.
NZB: కాకినాడలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్లో తెలంగాణ సెక్రటేరియట్ హాకీ టీం విజయం సాధించిందని కెప్టెన్ డాక్టర్ స్వామి కుమార్ తెలిపారు. హోరాహోరి పోరులో మధ్యప్రదేశ్ జట్టుపై నాలుగు మూడు స్కోర్తో ఘనవిజయం సాధించింది. 3-3తో డ్రాగ ముగుస్తున్న సమయంలో చివరి నిమిషంలో జనార్ధన్ గోల్ కోటడంతో విజయం సాధించినట్లు తెలిపారు.
WPL-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా మొత్తం ఈ సీజన్ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని RCB యాజమన్యం ప్రకటించింది. దీంతో ఆమె స్థానంలో స్నేహ రాణా జట్టులోకి తీసుకుంది. స్నేహ గత ఏడాది గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడింది. అయితే ఈ సారి వేలంలో ఆమెను ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
NTR: ఇటీవల కాకినాడలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నా లాజికల్ యూనివర్సిటీ జరిగిన అంతర్ జిల్లాల తైక్వాండో పోటీలలో వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలోని ఏకత్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. 61 కేజీల విభాగంలో కే వర్ధన్ సాయి రజత పతకం, 30 కేజీల విభాగంలో పి. జయ రేణుక, ఎం. లక్ష్మి సహస్ర, వి. యశస్విని కాంశ్య పతకాలు సాధించారు.
RCB తమ నూతన సారథిగా టీమిండియా బ్యాటర్ రజత్ పటీదార్ను ఎంపిక చేసింది. అయితే పటీదార్ను కెప్టెన్గా ఎంపిక చేయడాన్ని విరాట్ కోహ్లీ సమర్థించాడు. దేశవాళీలో మధ్యప్రదేశ్ జట్టును అతను అద్భుతంగా నడిపించాడని, RCBని నడిపించే నైపుణ్యం పటీదార్కు ఉందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. కాగా గతంలో కోహ్లీ అనంతరం డుప్లెసిస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఒక్కరూ హాఫ్ సెంచరీ చేయలేదు. భారత బౌలర్లలో అర్ష్దీప్, హర్షిత్ రాణా, పాండ్యా, అక్షర్ రెండేసి వికెట్లు సాధించారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఈ విక్టరీ పెద్ద ఊరట అనే చెప్పాలి.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాల చేత ఈ మెగా టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ధృవీకరించాడు. ఇప్పటికే కమిన్స్, మార్ష్, హాజిల్వుడ్, స్టోయినిస్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.