• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్

భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న రిటైర్మెంట్ ప్రకటించాడు. రెండు సార్లు గ్రాండ్‌స్లమ్ విజేతగా నిలిచిన బోపన్న.. రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్ ఆడాడు. ‘నా జీవితానికి అర్థం ఇచ్చిన ఈ ఆటకు ఎలా వీడ్కోలు చెప్పాలి? మర్చిపోలేని రీతిలో 20 ఏళ్ల పాటు టెన్నిస్ కెరీర్‌లో కొనసాగిన తర్వాత ఇప్పుడు నా రాకెట్‌ను అధికారికంగా పక్కన పెట్టే సమయం వచ్చింది’ అని పోస్ట్ చేశాడు.

November 1, 2025 / 03:01 PM IST

భారత్-ఎ లక్ష్యం ఎంతంటే?

భారత్-ఎతో జరుగుతున్న అనధికారిక తొలి టెస్టులో దక్షిణాఫ్రికా-ఎ జట్టు రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్ల దెబ్బకు ఆ జట్టు 199 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా-ఎ జట్టు 309 పరుగులు చేయగా.. భారత్-ఎ 234 పరుగులకు ఆలౌటైంది.

November 1, 2025 / 03:00 PM IST

ఆసుపత్రి నుంచి శ్రేయస్‌ అయ్యర్‌ డిశ్చార్చ్‌ 

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన BCCI.. అయ్యర్ కోలుకుంటున్నాడని తెలిపింది. అయితే పూర్తిగా ఫిట్‌నెస్ సాధించేవరకు అతను సిడ్నీలోనే ఉంటాడని పేర్కొంది. కాగా OCT 25న ఆసీస్‌తో 3వ వన్డేలో బంతి బలంగా పక్కటెముకలకు తగటడంతో అయ్యర్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

November 1, 2025 / 10:50 AM IST

అతణ్ని ఆడించు.. గంభీర్‌కి అశ్విన్ విజ్ఞప్తి

యువ బౌలర్ అర్ష్‌దీప్‌ని ఇకనైనా T20ల్లో ఆడించాలని టీమిండియా కోచ్ గంభీర్‌కి మాజీ ప్లేయర్ అశ్విన్ విజ్ఞప్తి చేశాడు. రెండో మ్యాచులో హర్షిత్ రాణా(35) బ్యాట్‌తో మార్క్ చూపించినా.. బుమ్రా తర్వాత ఫస్ట్ ప్రియారిటీ అర్ష్‌దీప్‌కే ఇవ్వాలని సూచించాడు. గత T20 WCలో అద్భుతంగా రాణించినప్పటికీ అతణ్ని పక్కన పెట్టడం సరికాదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

November 1, 2025 / 08:46 AM IST

పాక్ మాజీ కెప్టెన్ ఖాతాలో రోహిత్ రికార్డ్

పాక్ మాజీ కెప్టెన్, ప్లేయర్ బాబర్ అజామ్ ఇన్నాళ్లూ రోహిత్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును సొంతంచేసుకున్నాడు. సౌతాఫ్రికాతో రెండో T201లో 11 రన్స్ చేసిన ఆతను.. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు. అతను ఇప్పటివరకు 4234 రన్స్ చేయగా.. రోహిత్ 4231 చేశాడు. అటు కోహ్లీ(4188), జోస్ బట్లర్(ENG, 3869) 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.

November 1, 2025 / 07:13 AM IST

2018లోనే జెమీమా ప్రతిభను గుర్తించిన మాజీ కెప్టెన్

WWCలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో టీమిండియా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (127*) అద్భుత శతకం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆమె టీమిండియాకు స్టార్‌గా మారుతుందని 2018లోనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సెన్ తెలిపాడు. ‘జెమీమా రోడ్రిగ్స్ పేరు గుర్తుంచుకోండి. ఆమె భవిష్యత్‌లో టీమిండియాకు స్టార్‌గా మారుతుంది’ అని చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

October 31, 2025 / 09:50 PM IST

BREAKING: PKL విజేతగా దబాంగ్ ఢిల్లీ

ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఛాంపియన్‌గా దబాంగ్ ఢిల్లీ నిలిచింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో పుణేరి పల్టన్‌ను 30-28 తేడాతో ఓడించి రెండో సారి పీకేఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పుణేరి పల్టన్ కంటే దబాంగ్ 2 పాయింట్లు అధికంగా సాధించింది.

October 31, 2025 / 09:21 PM IST

BREAKING: టీమిండియా ఓటమి

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 18.4 ఓవర్లకు 125 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. మిచెల్ మార్ష్ 46, ట్రావిస్ హెడ్ 28, జోష్ ఇంగ్లిస్ 20 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, వరుణ్, కుల్దీప్ తలో రెండు వికెట్లు తీశారు.

October 31, 2025 / 05:05 PM IST

షటిల్ టోర్నమెంట్‌కు ఎంపికైన ఊటుకూరు విద్యార్థినులు

NTR: నవంబర్ 1న గన్నవరంలో జరగనున్న ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి షెడ్యూల్ టోర్నమెంట్ (అండర్ 17) విభాగంలో గంపలగూడెం మండలం ఊటుకూరు సిద్ధార్థ విద్యాలయానికి చెందిన విద్యార్థినులు ఎం ఉమ్మశ్రీ, ఎస్.కే సమీరా మాలిక్‌లు పాల్గోనున్నట్లు ఆ పాఠశాల డైరెక్టర్ సీహెచ్. కృష్ణరావు తెలిపారు. ఇటీవల నరసాపురంలో జరిగిన డివిజన్ స్థాయిలో ఎంపికైనట్లు వివరించారు.

October 31, 2025 / 04:12 PM IST

AUS vs IND: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 15.4 ఓవర్లకు 109 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (52*) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో కుల్‌దీప్ యాదవ్ (0), అభిషేక్ (52*) పరుగులతో ఉన్నారు.

October 31, 2025 / 03:24 PM IST

ఘనంగా ఉమ్మడి కృష్ణాజిల్లా పవర్ లిఫ్టింగ్ పోటీలు

కృష్ణా: ఎన్టీఆర్ స్టేడియం క్రీడా ప్రణాళికలో భాగంగా గుడివాడ ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో తారకరామారావు మెమోరియల్ ఉమ్మడి కృష్ణాజిల్లా పవర్ లిఫ్టింగ్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ పొందిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతాకాలను సాధించారని తెలిపారు.

October 31, 2025 / 03:18 PM IST

AUS vs IND: అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. ఓ వైపు కీలక వికెట్లు కోల్పోయిన కేవలం 23 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేశాడు. క్రీజులో అభిషేక్ శర్మ (51), హర్షిత్ రాణా (23) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం 13 ఓవర్లకు స్కోర్ 92/5గా ఉంది.

October 31, 2025 / 03:08 PM IST

5 వికెట్లు కోల్పోయిన భారత్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ కీలకమైన 5 వికెట్లు కోల్పోయింది. గిల్ (5), శాంసన్ (2), సూర్యకుమార్ యాదవ్ (1), అక్షర్ పటేల్ (7) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. తిలక్ వర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. హేజిల్‌వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఒక వికెట్ తీశాడు. అభిషేక్ శర్మ (34), హర్షిత్ రాణా (1) క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లకు స్కోరు 50/5.

October 31, 2025 / 02:42 PM IST

తడబడుతున్న భారత్.. అప్పుడే 3 వికెట్లు

మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో T20 మ్యాచులో భారత్ తడబడుతున్నట్లు కనిపిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ(24), తిలక్ వర్మ(0) క్రీజులో ఉన్నారు. అంతకుముందు గిల్(5), శాంసన్(2), సూర్య(1) వెంటవెంటనే వెనుదిరిగారు.

October 31, 2025 / 02:19 PM IST

BREAKING: మళ్లీ టాస్‌ ఓడిన భారత్

మెల్‌బోర్న్ వేదికగా కాసేపట్లో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా భారత్ మళ్లీ టాస్ ఓడింది. అయితే టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ ఎంచుకుంది.

October 31, 2025 / 01:20 PM IST