• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

17న జిల్లాస్థాయి కోలాటం పోటీలు

AKP: పరవాడ మండలం వాడచీపురుపల్లి గ్రామంలో ఈనెల 17వ తేదీన జిల్లాస్థాయి కోలాటం పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామంలో జరిగే రామచంద్రమ్మ జాతర సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొనే కోలాట బృందాలు తమ పేర్లను ఈనెల 16వ తేదీ సాయంత్రంలోగా కమిటీ వద్ద నమోదు చేయించుకోవాలన్నారు.

February 11, 2025 / 05:48 AM IST

సెంచరీతో విధ్వంసం చేసిన హిట్‌మ్యాన్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో కేవలం 77 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతడికి ఇది 32వ సెంచరీ. అలాగే, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో కోహ్లీ(51), సచిన్(49) ఉండగా.. రోహిత్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

February 9, 2025 / 08:16 PM IST

IND vs ENG: భారత్ టార్గెట్ ఎంతంటే..?

కటక్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించింది. 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటర్లు బెన్ డకెట్(65), జో రూట్(69), బట్లర్ (34), బ్రూక్(31), లివింగ్‌స్టోన్(41) సమిష్టిగా రాణించారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీయగా.. షమీ, రాణా, పాండ్యా, చక్రవర్తి తలో వికెట్ తీసుకున్నారు. భారత్ టార్గెట్ 305.

February 9, 2025 / 05:16 PM IST

SA T20 ఛాంపియన్స్‌గా ఎంఐ కేప్‌టౌన్

SA T20 లీగ్‌‌లో ఎంఐ కేప్‌టౌన్ విజేతగా నిలిచింది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన ఫైనల్లో 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌​ 18.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఎంఐ తొలిసారి SA20 ఛాంపియన్స్‌గా అవతరించింది. మార్కో జాన్సెన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.

February 9, 2025 / 02:23 PM IST

‘అక్షర్ పటేల్ మంచి ఆప్షన్‌గా అనిపిస్తోంది’

టీమిండియా మాజీ క్రికెటర్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి రిషభ్ పంత్‌ను దృష్టిలో ఉంచుకోవాలని తొలుత సూచించినట్లు తెలిపాడు. అయితే, ఇప్పుడు అక్షర్ పటేల్ మంచి ఆప్షన్‌గా అనిపిస్తోందని పేర్కొన్నాడు. మిడిలార్డర్‌లో అక్షర్ సరిపోతాడని.. బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంటుందని అన్నాడు. రిషభ్‌ పంత్‌కు ఛాన్స్‌లు తక్కువేనని చెప్పుకొచ్చాడు.

February 8, 2025 / 05:27 PM IST

శ్రేయస్‌ను పక్కన పెట్టొద్దు: జహీర్ ఖాన్

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. కోహ్లీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన శ్రేయస్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీనిపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్పందించాడు. శ్రేయస్ ఆత్మవిశ్వాసం అద్భుతమని.. తర్వాతి మ్యాచుల్లోనూ ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందని తెలిపాడు. మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను పక్కనపెట్టడం సరికాదన్నాడు.

February 7, 2025 / 02:29 PM IST

సూరారం గ్రామంలో యువకులకు క్రీడా సామగ్రి పంపిణీ

E.G: చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ క్రికెట్, వాలీబాల్ కిట్లు, క్రీడా ప్రాంగణానికి మూడు డే లైట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, గ్రామ యువకులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

February 6, 2025 / 08:06 AM IST

BREAKING: వన్డే సిరీస్‌కు మిస్టరీ స్పిన్నర్

టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తిని ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిని ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగం చేశారు. ఈ సిరీస్‌లో అతడు రాణిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా భాగమయ్యే అవకాశం ఉంది.

February 4, 2025 / 05:13 PM IST

వరుణ్ చక్రవర్తిపై సూర్యకుమార్ ప్రశంసలు

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సహచరులపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని తెలిపాడు. ఫీల్డింగ్ విషయంలో వరుణ్ చక్రవర్తి చొరవ అద్భుతంగా ఉంటుందని కితాబిచ్చాడు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు.

February 3, 2025 / 12:45 PM IST

U-19 వరల్డ్ కప్ : విశ్వ విజేతగా భారత్

U-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విశ్వ విజేతగా అవతరించింది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన SA 82 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్‌లో మన తెలుగమ్మాయి త్రిష(44) రాణించడంతో.. భారత్ కేవలం 11.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది.

February 2, 2025 / 02:26 PM IST

సింగిల్ డిజిట్‌కే విరాట్ కోహ్లీ ఔట్

టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత ఢిల్లీ తరఫున రంజీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే, రైల్వేస్‌తో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ విఫలమయ్యాడు. కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. సంగ్వాన్ బౌలింగ్‌లో కోహ్లీ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో అభిమానులు స్టేడియం వదలివెళ్లిపోతుండటం గమనార్హం.

January 31, 2025 / 11:22 AM IST

‘ఒలింపిక్స్ కోసం మౌళిక వసతుల బలోపేతం’

2036 ఒలింపిక్స్ అతిథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మౌళిక వసతుల్ని బలోపేతం చేస్తున్నామని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష అన్నారు. ‘వసతులతో పాటు మేధో పరిశోధన సంసిద్ధత సామర్థ్యం బలోపేతంపై కూడా దృష్టిసారించాం. క్రీడల మౌళిక సదుపాయాలతో మెగా టోర్నీలు లాభాసాటిగా మారేందుకు ఎలాంటి ఆర్థిక నమూనాలు సహయపడతాయనే విషయాలపై చర్చించాలి’ అని పేర్కొన్నారు.

January 30, 2025 / 09:03 AM IST

రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ విడుదల

రాజస్థాన్ రాయల్స్ కొత్త ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, డైరెక్టర్ కుమార సంగక్కర ఇటీవల ఫ్రాంచైజీ కార్యాలయంలో సమావేశమయ్యారు. వీరిద్దరూ కలిసి RR కొత్త జెర్సీని విడుదల చేశారు. ‘ఇద్దరు దిగ్గజాలు, ఒక జెర్సీ. రాజస్థాన్ రాయల్స్ ఈసారి IPL కప్ గెలవడానికి పక్కా ప్రణాళికతో వస్తుంది’ ఒక నెటిజెన్ కామెంట్ చేశాడు. మరొకరు.. ఈ సీజన్లో RR యాక్షన్ చూడాలని ఎదురుచూస్తున్నామని రీట్వీట్ చేశాడు.

January 29, 2025 / 05:02 PM IST

అతడి వల్లే మాకు ఈ ఓటమి: సూర్యకుమార్

రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. దీనిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అసాధారణ ప్రదర్శన తమ విజయవకాశాలను దెబ్బతీసినట్లు పేర్కొన్నాడు. అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడని.. అందుకే అతను వరల్డ్ క్లాస్ బౌలర్ అయ్యాడని తెలిపాడు. బ్యాటింగ్ విభాగంపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నాడు.

January 29, 2025 / 08:26 AM IST

జాతీయ స్థాయి పోటీలకు పెద్దాపురం విద్యార్థిని

KKD: జాతీయ స్థాయి స్కూల్ క్రీడా పోటీలకు పెద్దాపురంకు చెందిన విద్యార్థిని మన్యం పల్లవి ఎంపికైనట్లు పీడీ కామిరెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఆర్బీపట్నం జడ్పీ స్కూల్లో ఆరో తరగతి చదివే మన్యం పల్లవి జిమ్నాస్టిక్స్‌లో  ఎంపికైందన్నారు. ఆమె జనవరి 29-30 వరకు పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో జరిగే క్రీడల్లో అండర్-14 అమ్మాయిల కేటగిరీల్లో పాల్గొంటుందన్నారు.

January 27, 2025 / 12:25 PM IST