VZM: జనవరి 3 నుండి 8 వరకూ ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కబడ్డీ పోటీలకు గుణుపూరు పేట వ్యాయామ ఉపాధ్యాయుడు సారిపల్లి గౌరీశంకర్ ఎంపికైనట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపికల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే జట్టుకు ఎంపికయ్యారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీ బ్రేక్ సమయానికి టీమిండియా 112/3 పరుగులు చేసింది. ప్రస్తుతం యశస్వి (63*), పంత్ (28*) క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ 9 , కేఎల్ రాహుల్ 0, కోహ్లీ 5 పరుగులకే పెవిలియన్కు చేరారు. భారత్ విజయానికి ఇంకా 228 పరుగులు కావాల్సి ఉంది. ఇక ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 2 వికెట్లు, మిచెల్ స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీ బ్రేక్ సమయానికి టీమిండియా 112/3 పరుగులు చేసింది. ప్రస్తుతం యశస్వి (63*), పంత్ (28*) క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ 9 , కేఎల్ రాహుల్ 0, కోహ్లీ 5 పరుగులకే పెవిలియన్కు చేరారు. భారత్ విజయానికి ఇంకా 228 పరుగులు కావాల్సి ఉంది. ఇక ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 2 వికెట్లు, మిచెల్ స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.
బాక్సింగ్ డే టెస్టులో భారత ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకు యశస్వి, పంత్ ప్రయత్నిస్తున్నారు. యశస్వి 58* , పంత్ 17* పరుగులతో నిలకడగా రాణిస్తున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ 40 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి మరో 243 పరుగులు కావాల్సి ఉంది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే రెండో ఇన్నింగ్స్లో టీమిండియా కష్టాల్లో పడింది. 16 ఓవర్లలో 25 పరుగులు చేసిన భారత్ అదే స్కోర్ వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులకే ఔట్ అవ్వగా క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ కూడా అదే ఓవర్లో డకౌట్ అయ్యాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 33/3 పరుగులు చేసింది. జట్టు విజయానికి మరో 307 పరుగులు కావాల్సి ఉంది. రోహిత్ శర్మ 9 , కేఎల్ రాహుల్ 0, కోహ్లీ 5 పరుగులకే వెనుదిరిగారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 2 వికెట్లు, మిచెల్ స్టార్క్ ఒక వికెట్ పడగొట్టాడు.
విజయనగరం ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆదివారం స్దానిక రాజీవ్ గాంధీ స్టేడియంలో అథ్లెటిక్ క్రీడాకారులను కలసి అభినందనలు తెలిపారు. కృష్ణా జిల్లాలో ఈనెల 14, 15న జరిగిన రాష్ట్ర స్థాయి అభ్లెటిక్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులతో మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి ఖ్యాతి తీసుకు రావాలని క్రీడాకారులను కోరారు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో జరుగుతున్న 4వ టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ముగిసింది. 228/9 ఓవర్నైట్ స్కోర్తో 5వ రోజు ఆట ప్రారంభించిన ఆతిథ్య జట్టు 234 పరుగులకు ఆలౌటైంది. 339 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. లబుషేన్ (71) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ టెస్టులో గెలవాలంటే భారత్ 340 పరుగులు చేయాల్సి ఉంది.
W.G: ఉండి మండలం కోలమూరు గ్రామానికి చెందిన నంబూరి కార్తీక్ వర్మ పశ్చిమగోదావరి జిల్లా అండర్-12 జట్టుకి కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా కార్తీక్ వర్మను డీఎన్ఆర్ ఏసీ ఏ క్యాంప్ కోచ్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కార్తీక్ వర్మను భీమవరం పట్టణంలోని క్రికెట్ అభిమానులు, పట్టణ ప్రాంత ప్రజలు అభినందించారు.
కృష్ణా జిల్లాకు చెందిన చెస్ ప్లేయర్ కోనేరు హంపి 2024 మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. ఆదివారం న్యూయార్క్ (USA)లో జరిగిన ఫైనల్లో హంపి, ఇండోనేషియాకు చెందిన ఇరీన్ సుకందార్పై విజయం సాధించి టైటిల్ దక్కించుకుంది. 2019లో కూడా ఈ ఛాంపియన్షిప్ గెలిచిన హంపి, రెండోసారి ఈ ఘనత సాధించింది.
SKLM: వజ్రపుకొత్తూరు గోవిందపురం ఉన్నత పాఠశాలలో ఈనెల 30, 31న గ్రిగ్స్ మీటను నిర్వహించనున్నట్లు హెచ్ఎం కె.హరిబాబు, పీడీ .నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. కావున నియోజకవర్గంలోనే ఉన్న క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించి ఈ పోటీలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాఠశాల అనుమతి తప్పనిసరి అన్నారు.
SKLM: పారా అథ్లెటిక్స్ ఛాంపియన్- 2025 పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికలు నిర్వహించనున్నట్లు స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాము తెలిపారు. జిల్లా స్థాయి ఎంపికల్లో పాల్గొనేందుకు క్రీడా కారులు తమ వివరాలను జనవరి 5లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9381368209 నంబర్ సంప్రదించాలని తెలిపారు.
ప్రో కబడ్డీ సీజన్-11 పూణేలోని చత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో పట్నా పైరేట్స్ పై హర్యానా స్టీలర్స్ 32-23 పాయింట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ నుంచి శివమ్ పటారే(9) పాయింట్స్ సాధించి తన జట్టును విజయం వైపుకు నడిపించాడు. దీంతో హర్యానా.. సీజన్-11 ఛాంపియన్స్గా నిలిచింది.
బాక్సింగ్ డే టెస్ట్ నాలుగో రోజు జరిగిన మ్యాచ్లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ మూడు క్యాచ్లు జారవిడిచాడు. ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, కమిన్స్ ఇచ్చిన క్యాచ్లను నేలపాలు చేశాడు. దీంతో జైస్వాల్పై రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. ‘అరే జస్సూ.. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా..? బాల్ ఆడేదాకా కిందే ఉండు’ అంటూ ఆగ్రహానికి గురయ్యాడు.
పాకిస్థాన్తో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించింది. మార్క్రమ్ 37, తెంబా బావుమా 40 పరుగులతో రాణించారు. అయితే, వరుసగా వికెట్లు కోల్పోయిన సమయంలో కగిసో రబాడ 31* కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు.