‘విజయ్-రష్మిక నన్ను మీ పెళ్లికి ఎందుకు పిలవలేదు?’ అంటూ ఓ చిన్నారి అడిగిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై విజయ్ స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘బుజ్జితల్లి.. నిన్ను ఇంటికి లంచ్కు పిలుస్తాను. నీకు ఇష్టమైన ఫుడ్, స్వీట్స్ చెబితే అన్నీ ఇంట్లోనే చేయించుకుని తిందాం’ అంటూ ఆ వీడియో కింద కామెంట్ చేశాడు. చిన్నరి పట్ల విజయ్ చూపిన ఈ ఆప్యాయతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
న్యూజిలాండ్తో జరగనున్న ఫైనల్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. మ్యాచ్కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సూర్య మాట్లాడుతూ.. తొలుత బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోరు చేస్తామనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని అన్నాడు. అయితే గతంలో తమ జట్టు 250 పైచిలుకు భారీ స్కోర్లను సాధించినట్లు గుర్తు చేశాడు.
అహ్మదాబాద్లోని మోదీ స్టేడియం వేదికగా టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. గ్లోబల్ పాప్ స్టార్ రికీ మార్టిన్ ఈ వేడుకల్లో ప్రదర్శన ఇవ్వబోతున్నారు. అలాగే, సంగీత దిగ్గజాలు సుఖ్బీర్, ఫల్గుణి పాఠక్ కూడా తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.
భారత్ – ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఈ సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 20 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 323, భారత్ 198 పరుగులు చేశాయి.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రేపు జరగబోయే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా, అతడు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సూర్య వయసు 35 ఏళ్లు కావడంతో, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయమని అతడు భావిస్తున్నట్లు సమాచారం.
టీ20 క్రికెట్లో నెం.1 బౌలర్గా కొనసాగుతున్న వరుణ్ చక్రవర్తి గత కొన్ని మ్యాచ్ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు బౌలింగ్ చేసేటప్పుడు ‘రౌండ్ ది వికెట్’ రావద్దని వరుణ్కు చాలాసార్లు సూచించినట్లు పేర్కొన్నాడు. అయితే, అతడు పదేపదే అదే తప్పు చేస్తున్నాడని తెలిపాడు.
ఇంగ్లండ్ కోచ్ మెక్కల్లమ్ను తప్పించబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్పందించాడు. ‘మెక్కల్లమ్ కోచ్గా కొనసాగాలని మేము 125% కోరుకుంటున్నాము. నేను చూసిన అత్యుత్తమ కోచ్ అతనే. డ్రెస్సింగ్ రూమ్లో అతనికి ఒక ప్రత్యేకమైన ఆరా ఉంటుంది. జట్టులోని ప్రతి ఒక్కరూ అతడిని గౌరవిస్తారు. స్ఫూర్తిగా తీసుకుంటారు’ అని పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అన్నాడు. ట్రోఫీ సాధించడం కోసం 140 కోట్ల భారత అభిమానుల హృదయాలను బ్రేక్ చేయడానికి కూడా తాము వెనకాడబోమని పేర్కొన్నాడు. సొంతగడ్డపై ఫైనల్ కావడంతో తమకంటే భారత జట్టుపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. ఫైనల్లో విజయమే లక్ష్యంగా తాము బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించాడు.
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు. ఆయన మాట్లాడుతూ.. ‘అభిషేక్ శర్మ అసాధారణమైన ఆటగాడు. అతను ఒక అద్భుతమైన ప్రతిభావంతుడు. అభిషేక్ బ్యాటింగ్ చేసే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. అతడిని వేరే ఏ ఇతర బ్యాటర్తోనూ అస్సలు పోల్చలేము’ అని పేర్కొన్నాడు.
భారత మహిళా క్రికెట్ జట్టుతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 323 పరుగులకు ఆలౌటైంది. సదర్లాండ్ (129) సెంచరీతో మెరవగా, పెర్రీ (76) హాఫ్ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో సయాలి 4 వికెట్లు పడగొట్టగా, క్రాంతి, దీప్తి తలో రెండు వికెట్లు తీశారు. అయితే, భారత్ తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులే చేయడంతో, ఆస్ట్రేలియాకు 125 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
అహ్మదాబాద్లోని మోదీ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని కివీస్ కెప్టెన్ శాంట్నర్ వ్యాఖ్యానించాడు. అలాగే, సొంతగడ్డపై జరిగే ఫైనల్లో భారత్పై విజయం సాధించడం అంత సులభం కాదన్నాడు. భారత జట్టులో బుమ్రా మాత్రమే కాదు, ప్రతి ప్లేయర్తోనూ తమకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నాడు.
రేపు భారత్తో జరగబోయే ఫైనల్ మ్యాచ్కు ముందు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాను చూసి అంతగా భయపడాల్సిన పని లేదన్నాడు. బుమ్రా అద్భుతమైన బౌలర్ అయినప్పటికీ, అతడు కూడా ఒక మనిషేనని చెప్పాడు. ఏదో ఒక రోజు అతడు విఫలమవుతాడని, అది ఈ ఫైనలే అవ్వాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించాడు. బుమ్రాను ధాటిగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. జియోహాట్స్టార్లో ఈ మ్యాచ్ను ఒకే సమయంలో ఏకంగా 65.2 మిలియన్ల మంది వీక్షించడం విశేషం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఏ క్రీడలోనైనా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇంతమంది ఒకేసారి చూడటం ఇదే అత్యధికం. రేపు జరిగే ఫైనల్ ఈ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది.
టీమిండియా- న్యూజిలాండ్ మధ్య రేపు ప్రపంచకప్ ఫైనల్ ఫైట్ జరగనుంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు డివిలియర్స్, స్టెయిన్ ఫైనల్ విజేతగా నిలిచేది ఎవరో వెల్లడించారు. భారత్ ఛాంపియన్గా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. అయితే, కివీస్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. టీమిండియా ఏదైనా పెద్ద తప్పిదం చేస్తే తప్ప, NZ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు.
రేపు న్యూజిలాండ్తో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టులో మార్పులు చేయాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తిని జట్టు నుంచి తొలగించి, అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలని చెప్పాడు. మరోవైపు, వరుసగా విఫలమవుతున్నప్పటికీ అభిషేక్ శర్మను ఫైనల్ మ్యాచ్లోనూ కొనసాగించాలని ఆయన సూచించాడు.